గాంబియాకి బాడీగార్డ్లను పంపడంలేదు: కువైట్
- May 26, 2016
గాంబియన్ మీడియా, ప్రెసిడెంట్ యాయా జెమ్మెకి కువైట్ నుంచి బాడీగార్డులను పంపుతున్నట్లుగా చేస్తున్న ప్రచారాన్ని కువైట్ ఖండించింది. ఆఫ్రికన్ అఫైర్స్ అసిస్టెంట్ పారిన్ మినిస్టర్ హమాద్ అల్ మషాన్ మాట్లాడుతూ, ఈ వార్తల్లో నిజం లేదని చెప్పారు. 320 మంది శిక్షణ పొందిన బాడీగార్డుల్ని గాంబియాకి కువైట్ పంపుతున్నారనే వార్తలు గాంబియన్ మీడియాలో వెల్లువెత్తాయి. ఏప్రిల్ 2016లో గాంబియా ప్రెసిడెంట్ భార్య మేడమ్ జైనాబ్ కువైట్లో పర్యటించిన సందర్భంలో ఈ ఒప్పందం కుదిరిందని ఓ వార్తా పత్రిక కథనాన్ని ప్రచురించింది. గాంబియాని ఇస్లామిక్ దేశంగా మార్చే ప్రయత్నాల్లోనే ఇదంతా జరుగుతోందని ఆ కథనంలో విశ్లేసించగా, కువైట్ తాము అలాంటి చర్యలకు పాల్పడటం లేదనీ, ఎలాంటి సమాచారం లేకుండా ఆ వార్తలు రాశారని పేర్కొంది.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







