100 మంది దుబాయ్ డ్రైవర్లకు 50,000 దిర్హామ్ల జరిమానా
- December 10, 2023
యూఏఈ: జాతీయ దినోత్సవ వేడుకల సందర్భంగా ట్రాఫిక్ భద్రతా నిబంధనలను ఉల్లంఘించినందుకు దుబాయ్లో డజన్ల కొద్దీ డ్రైవర్లకు జరిమానాలు, వారి వాహనాలను జప్తు చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు. 4,420 ప్రమాదకరమైన ఉల్లంఘనలు నమోదయ్యాయి. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, రోడ్డు విన్యాసాలు చేయడం నుండి అనధికార కవాతులు, పోలీసు సూచనలను ధిక్కరించడం వంటి ఉల్లంఘనలు నమోదు అయ్యాయి. మొత్తం 94 కార్లు, ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అధికార యంత్రాంగం ఇప్పుడు కొన్ని నేరస్తుల ఉల్లంఘనలను చూపించే వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసింది. "వాహనాన్ని స్వాధీనం చేసుకునేందుకు సంబంధించిన డిక్రీ 30 ప్రకారం నేరస్తులు కఠినమైన జరిమానాలను ఎదుర్కొంటారు. వాహన విడుదల కోసం జరిమానాలు Dh50,000 వరకు ఉంటాయి." అని దుబాయ్ పోలీస్లోని జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాఫిక్ డైరెక్టర్ మేజర్-జనరల్ సైఫ్ ముహైర్ అల్ మజ్రూయి తెలిపారు. అల్ రువయ్యా, జుమైరా మరియు ఇతర నివాస ప్రాంతాలలో చాలా ఉల్లంఘనలు నమోదైనట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఖైదీల విడుదల ఒప్పందాన్ని స్వాగతించిన ఒమన్..!!
- లుసైల్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ లో ప్రీమియం ప్యాకేజీలు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో బంగారం దొంగతనం కేసులో ఎనిమిది మందికి శిక్ష..!!
- ఫహహీల్ పారిశ్రామిక ప్రాంతంలో 95 దుకాణాలు సీజ్..!!
- Danalac శిశు ఆహారం పారవేసివేయాలని యూఏఈ పిలుపు..!!
- అల్ హదీథా సరిహద్దు వద్ద 4,26,000 ఆంఫెటమైన్ పిల్స్ స్వాధీనం..!!
- నెదర్లాండ్స్ చేరుకున్న ప్రధాని మోదీ–భారత్-ఈయూ వాణిజ్య బంధాలకు కొత్త ఊపు
- స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్రతో స్పష్టమైన మార్పు: సీఎం చంద్రబాబు
- ప్రమాదకర డ్రైవింగ్కు పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న దుబాయ్ పోలీసులు
- సైబర్ నేరాల నిర్మూలనకు 90 రోజుల యాక్షన్ ప్లాన్: ఏపీ డీజీపీ..









