100 మంది దుబాయ్ డ్రైవర్లకు 50,000 దిర్హామ్ల జరిమానా
- December 10, 2023
యూఏఈ: జాతీయ దినోత్సవ వేడుకల సందర్భంగా ట్రాఫిక్ భద్రతా నిబంధనలను ఉల్లంఘించినందుకు దుబాయ్లో డజన్ల కొద్దీ డ్రైవర్లకు జరిమానాలు, వారి వాహనాలను జప్తు చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు. 4,420 ప్రమాదకరమైన ఉల్లంఘనలు నమోదయ్యాయి. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, రోడ్డు విన్యాసాలు చేయడం నుండి అనధికార కవాతులు, పోలీసు సూచనలను ధిక్కరించడం వంటి ఉల్లంఘనలు నమోదు అయ్యాయి. మొత్తం 94 కార్లు, ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అధికార యంత్రాంగం ఇప్పుడు కొన్ని నేరస్తుల ఉల్లంఘనలను చూపించే వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసింది. "వాహనాన్ని స్వాధీనం చేసుకునేందుకు సంబంధించిన డిక్రీ 30 ప్రకారం నేరస్తులు కఠినమైన జరిమానాలను ఎదుర్కొంటారు. వాహన విడుదల కోసం జరిమానాలు Dh50,000 వరకు ఉంటాయి." అని దుబాయ్ పోలీస్లోని జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాఫిక్ డైరెక్టర్ మేజర్-జనరల్ సైఫ్ ముహైర్ అల్ మజ్రూయి తెలిపారు. అల్ రువయ్యా, జుమైరా మరియు ఇతర నివాస ప్రాంతాలలో చాలా ఉల్లంఘనలు నమోదైనట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో ADNOC నౌకపై దాడిని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- తెలంగాణ, ఏపీ మీదుగా మరో 2 అమృత్ భారత్ రైళ్లు!
- భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ముర్ముకు యూఏఈ నేతల శుభాకాంక్షలు
- భార్య అనుకుని మరో మహిళపై దాడి.. షార్జాలో వ్యక్తిపై కేసు..!!
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు విజ్ఞప్తి
- కువైట్లో ఘనంగా భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!
- బహ్రెయిన్కు భారత్ అండగా ఉంటుంది.. జైశంకర్ పర్యటనతో భరోసా..!!
- అల్ సాద్ మెట్రో స్టేషన్లో ఆకట్టుకుంటున్న ఆర్టిస్టిక్ మ్యూరల్స్..!!
- భారత్@80.. సౌదీ అరేబియాతో మరింత బలపడుతున్న భాగస్వామ్యం..!!
- మస్కట్లో ఘనంగా భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!







