కారుతో ఢీకొట్టడం ద్వారా హత్య యత్నం.. ఇద్దరు సౌదీ పౌరులపై విచారణ
- December 12, 2023
రియాద్: ఉద్దేశపూర్వకంగా కారుతో ఢీకొట్టి ఒక వ్యక్తిని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు సౌదీ పౌరుల కేసును సౌదీ పబ్లిక్ ప్రాసిక్యూషన్ విచారించింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ విచారణలో ఇద్దరు నిందితులు ప్రజా భద్రతకు హాని కలిగించే విధంగా అధిక వేగంతో డ్రైవింగ్ చేస్తున్నారని, రెండు వాహనాల డ్రైవర్లు తమ మధ్య ఉన్న మునుపటి వివాదాలతో.. ఒకరికి ప్రమాదం జరగాలనే ఉద్దేశ్యంతో ఒకరినొకరు ఢీకొట్టుకోవాలని నిర్ణయించుకున్నారని నివేదికలో అధికారులు తెలిపారు. కానీ, రెండు వాహనాల్లో ఒకటి దారి నుంచి తప్పుకుని విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో ప్రయాణికుల్లో ఒకరు మృతి చెందగా, మరికొందరికి గాయాలయ్యాయి. ఇద్దరు ముద్దాయిలను అరెస్టు చేశారు. వారికి వ్యతిరేకంగా సమర్థ న్యాయస్థానంలో క్రిమినల్ వ్యాజ్యం దాఖలు చేశారు. వారికి చట్టంలో సూచించిన గరిష్ట జరిమానాలు విధించాలని కోర్టును కోరింది. ప్రయాణీకుల భద్రత కోసం ట్రాఫిక్ నిబంధనలను పాటించడం, వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని పబ్లిక్ ప్రాసిక్యూషన్ సూచించింది.
తాజా వార్తలు
- ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ షేక్ అల్-ఇస్సాతో భారత రాయబారి విపుల్ భేటీ
- దృష్టి కోసం ఐక్యంగా.. డెట్రాయిట్లో శంకర నేత్రాలయ 5K వాక్ విజయవంతం
- దుబాయ్లో 35 పాఠశాలల సెక్యూరిటీ గార్డులకు ట్రాఫిక్ భద్రతపై శిక్షణ
- అర్జెంటీనాకు ఆరోగ్య సేవలను అందించనున్న భారత్
- హోర్ముజ్ జలసంధిలో నౌకాయాన భద్రతపై ఒమన్, ఖతార్తో కువైట్ విదేశాంగ మంత్రి చర్చలు
- ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్స్తాన్ దేశాల్లో 4 రోజుల పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ
- సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక నిబంధనలు
- భారత్–యూఏఈ విమాన చార్జీల్లో భారీ తగ్గింపు..!!
- భారత్–కువైట్ రక్షణ బంధం మరింత బలోపేతం..!!
- సౌదీ కస్టమ్స్ భారీ డ్రగ్స్ ముఠా కుట్ర భగ్నం..!!







