కారుతో ఢీకొట్టడం ద్వారా హత్య యత్నం.. ఇద్దరు సౌదీ పౌరులపై విచారణ

- December 12, 2023 , by Maagulf
కారుతో ఢీకొట్టడం ద్వారా హత్య యత్నం.. ఇద్దరు సౌదీ పౌరులపై విచారణ

రియాద్:  ఉద్దేశపూర్వకంగా కారుతో ఢీకొట్టి ఒక వ్యక్తిని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు సౌదీ పౌరుల కేసును సౌదీ పబ్లిక్ ప్రాసిక్యూషన్ విచారించింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్‌ విచారణలో ఇద్దరు నిందితులు ప్రజా భద్రతకు హాని కలిగించే విధంగా అధిక వేగంతో డ్రైవింగ్ చేస్తున్నారని, రెండు వాహనాల డ్రైవర్లు తమ మధ్య ఉన్న మునుపటి వివాదాలతో.. ఒకరికి ప్రమాదం జరగాలనే ఉద్దేశ్యంతో ఒకరినొకరు ఢీకొట్టుకోవాలని నిర్ణయించుకున్నారని నివేదికలో అధికారులు తెలిపారు. కానీ, రెండు వాహనాల్లో ఒకటి దారి నుంచి తప్పుకుని విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో ప్రయాణికుల్లో ఒకరు మృతి చెందగా, మరికొందరికి గాయాలయ్యాయి. ఇద్దరు ముద్దాయిలను అరెస్టు చేశారు.  వారికి వ్యతిరేకంగా సమర్థ న్యాయస్థానంలో క్రిమినల్ వ్యాజ్యం దాఖలు చేశారు.  వారికి చట్టంలో సూచించిన గరిష్ట జరిమానాలు విధించాలని కోర్టును కోరింది.  ప్రయాణీకుల భద్రత కోసం ట్రాఫిక్ నిబంధనలను పాటించడం, వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని పబ్లిక్ ప్రాసిక్యూషన్ సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com