మార్చి 2024 నాటికి కువైట్ విమానాలు.. అకాసా ఎయిర్
- December 12, 2023
కువైట్ : దివంగత బిలియనీర్ రాకేష్ జున్జున్వాలా-మద్దతుగల అకాసా ఎయిర్ మార్చి 2024 చివరి నాటికి అంతర్జాతీయ కార్యకలాపాలను ప్రారంభించాలని యోచిస్తోంది. ఆకాసా ఎయిర్ సీఈఓ వినయ్ దూబే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మార్చి 2024 చివరి నాటికి అంతర్జాతీయ కార్యకలాపాలను ప్రారంభించాలని యోచిస్తోందని తెలిపారు. తక్కువ-ధర క్యారియర్కు ప్రారంభ గమ్యస్థానాలు కువైట్, దోహా, జెడ్డా మరియు రియాద్ కాగా, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ మరియు మాల్దీవులు రెండవ దశలో భాగంగా ఉంటాయని ఆయన చెప్పారు. విమానయాన సంస్థ విదేశాలకు వెళ్లేందుకు సెప్టెంబర్లో భారత ప్రభుత్వం నుండి అనుమతి పొందింది. సౌదీ అరేబియా, కువైట్ మరియు ఖతార్లకు కార్యకలాపాల కోసం మరుసటి నెలలో ట్రాఫిక్ హక్కులను మంజూరు అయ్యాయి. అయితే ఇది ఇప్పటికీ ఆ దేశాల ప్రభుత్వాల నుండి అనుమతి రావాల్సి ఉంది.
తాజా వార్తలు
- ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ షేక్ అల్-ఇస్సాతో భారత రాయబారి విపుల్ భేటీ
- దృష్టి కోసం ఐక్యంగా.. డెట్రాయిట్లో శంకర నేత్రాలయ 5K వాక్ విజయవంతం
- దుబాయ్లో 35 పాఠశాలల సెక్యూరిటీ గార్డులకు ట్రాఫిక్ భద్రతపై శిక్షణ
- అర్జెంటీనాకు ఆరోగ్య సేవలను అందించనున్న భారత్
- హోర్ముజ్ జలసంధిలో నౌకాయాన భద్రతపై ఒమన్, ఖతార్తో కువైట్ విదేశాంగ మంత్రి చర్చలు
- ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్స్తాన్ దేశాల్లో 4 రోజుల పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ
- సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక నిబంధనలు
- భారత్–యూఏఈ విమాన చార్జీల్లో భారీ తగ్గింపు..!!
- భారత్–కువైట్ రక్షణ బంధం మరింత బలోపేతం..!!
- సౌదీ కస్టమ్స్ భారీ డ్రగ్స్ ముఠా కుట్ర భగ్నం..!!







