మార్చి 2024 నాటికి కువైట్ విమానాలు.. అకాసా ఎయిర్
- December 12, 2023
కువైట్ : దివంగత బిలియనీర్ రాకేష్ జున్జున్వాలా-మద్దతుగల అకాసా ఎయిర్ మార్చి 2024 చివరి నాటికి అంతర్జాతీయ కార్యకలాపాలను ప్రారంభించాలని యోచిస్తోంది. ఆకాసా ఎయిర్ సీఈఓ వినయ్ దూబే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మార్చి 2024 చివరి నాటికి అంతర్జాతీయ కార్యకలాపాలను ప్రారంభించాలని యోచిస్తోందని తెలిపారు. తక్కువ-ధర క్యారియర్కు ప్రారంభ గమ్యస్థానాలు కువైట్, దోహా, జెడ్డా మరియు రియాద్ కాగా, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ మరియు మాల్దీవులు రెండవ దశలో భాగంగా ఉంటాయని ఆయన చెప్పారు. విమానయాన సంస్థ విదేశాలకు వెళ్లేందుకు సెప్టెంబర్లో భారత ప్రభుత్వం నుండి అనుమతి పొందింది. సౌదీ అరేబియా, కువైట్ మరియు ఖతార్లకు కార్యకలాపాల కోసం మరుసటి నెలలో ట్రాఫిక్ హక్కులను మంజూరు అయ్యాయి. అయితే ఇది ఇప్పటికీ ఆ దేశాల ప్రభుత్వాల నుండి అనుమతి రావాల్సి ఉంది.
తాజా వార్తలు
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్
- పిల్లలను కొట్టొద్దు..పేరెంట్స్ కు దుబాయ్ పోలీసులు సలహా..!!
- 24వేల రవాణా సంస్థలను హెచ్చరించిన TGA..!!
- టూర్ ఆఫ్ ఫ్లాండర్స్ సైక్లిస్టులకు జరిమానాలు..!!
- వదంతులను నమ్మొద్దు..ప్రజలకు క్యాబినెట్ విజ్ఞప్తి..!!
- ఖతార్ లో విద్యాసంస్థల సెలవులు పొడిగింపు..!!
- ప్రాంతీయ పరిణామాలపై కువైట్, ఒమన్ చర్చలు..!!









