కువైట్లో 40 రోజుల సంతాప దినాలు...3 రోజులపాటు సెలవులు
- December 17, 2023
కువైట్: కువైట్ ఎమిర్ షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ సబా మృతి నేపథ్యంలో 40 రోజుల సంతాప దినాలు ప్రకటించారు. అలాగే కువైట్లోని ప్రభుత్వ కార్యాలయాలకు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. సంతాప దినాల సందర్భంగా రాష్ట్ర కార్యాలయాల్లో జెండాలు అర మాస్టారుకు ఎగురవేయనున్నారు. మరోవైపు కువైట్ రాయల్ కోర్ట్ షేక్ నవాఫ్ అంత్యక్రియల వివరాలను ప్రకటించింది. ఆదివారం ఉదయం 9 గంటలకు బిలాల్ బిన్ రబా మసీదులో ప్రార్థనలు జరుగుతాయి. అంత్యక్రియలకు కుటుంబ సభ్యులకు మాత్రమే అనుమతి ఉంటుంది. కొత్త ఎమిర్ షేక్ మిషాల్ అల్ అహ్మద్ అల్ జబర్ అల్ సబా, ఇతర రాజకుటుంబ సభ్యులతో కలిసి సోమవారం, మంగళవారం బయాన్ ప్యాలెస్లో సంతాపాన్ని స్వీకరిస్తారని రాయల్ కోర్ట్ తెలిపింది.
తాజా వార్తలు
- రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే
- గూగుల్ మ్యాప్స్లో సరికొత్త AI ఫీచర్లు
- ఇండిగో ప్రయాణికులకు ‘ఇంధన’ భారం
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!









