ఎన్నారై యశస్వి బొద్దులూరి అరెస్టు
- December 23, 2023
హైదరాబాద్: అమెరికాలో సాఫ్టువేరు ఇంజనీరుగా వృత్తి బాధ్యతలు నిర్వహిస్తూ, భార్యాపిల్లలతో నివసిస్తున్న యష్, అనారోగ్యంతో ఉన్న తన తల్లిని పరామర్శించడానికి ఈ రోజు హైదరాబాద్ విమానాశ్రయంలో దిగగానే, జగన్ రెడ్డి నియంత ప్రభుత్వం పొంచి ఉండి అరెస్ట్ చేసి మంగళగిరి డిజిపి ఆఫీసుకు తరలిస్తున్నది.
ప్రవాసంలో ఉండి కూడా, రాష్ట్రం పట్ల బాధ్యతగల పౌరుడిగా, నిత్యం రాష్ట్రంలో జరిగే పరిణామాలమీద తన అభిప్రాయాల్ని సోషల్ మీడియాలో నిర్భయంగా వెలిబుచ్చే యష్ పైన వైసిపి ప్రభుత్వం కక్షగట్టింది. నిరంతరం ఇండియాలో ఉన్న అతని కుటుంబసభ్యుల్ని వేధిస్తోంది. ఇంతకు మునుపు కూడా వైసిపి కార్యకర్తలు అతని ఇంటి మీద దాడి చేసి కుటుంబాన్ని భయభ్రాంతుల్ని చేశారు.
ఒక ఎన్నారై స్వేచ్ఛగా తన అభిప్రాయాల్ని వెల్లడించే హక్కుని కాలరాసి, అదేదో రాజద్రోహ నేరంలాగా ఎయిర్పోర్టులో దిగగానే అరెస్ట్ చేయాలనే దుర్బుద్ధితో పన్నాగం వేయడం జగన్ ప్రభుత్వ దుర్మార్గాన్ని సూచిస్తోంది. ఇటువంటి అప్రజాస్వామిక నిర్బంధాన్ని అమెరికా టీడీపీ ఎన్నారై నేత జయరాం కోమటి తీవ్రంగా ఖండించారు. యష్ భద్రత పట్ల ఈ ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించి, వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసారు.
--రమ్య సాగర్ కర్రీ(మాగల్ఫ్ ప్రతినిధి,ఆంధ్ర ప్రదేశ్)
తాజా వార్తలు
- అనంతపురాన్ని సేవతో మార్చిన ఫాదర్ విన్సెంట్ ఫెరర్ జయంతి నేడు
- విద్యాభివృద్ధికి రూ.110 కోట్లు.. ముందుకొచ్చిన కార్పొరేట్ సంస్థలు
- కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు..
- లూలు మాల్కు భూకేటాయింపు రద్దు
- తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు ఇండియన్ రైల్వే గుడ్ న్యూస్
- తమిళనాడు ప్రధాన కార్యదర్శిగా ఎం.సాయి కుమార్ బాధ్యతలు స్వీకారం
- టీవీ యూజర్లకు బిగ్ షాక్ ఇచ్చిన యూట్యూబ్
- కువైట్ లో విషాదం..రోడ్డు పై 5 మంది మృతి!!
- ప్రయాణికులకు ఊరట.. గల్ఫ్ ఎయిర్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- కువైట్ కాన్సులేట్ పై జరిగిన దాడిని ఖండించిన ఒమన్..!!









