కువైట్ లో ప్రయివేటు రంగ కార్మికులకు శుభవార్త
- December 29, 2023
కువైట్: ప్రైవేట్ రంగంలోని కార్మికులు అసలు యజమాని ఆమోదంతో మరొక యజమాని కోసం పార్ట్టైమ్ పని చేయడానికి అనుమతిస్తూ ఒక నిర్ణయాన్ని మొదటి ఉప ప్రధాన మంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి, షేక్ తలాల్ అల్-ఖాలీద్ జారీ చేశారు. ఈ నిర్ణయం జనవరి 2024 నుండి అమలులోకి వస్తుంది. పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్పవర్ నుండి పార్ట్టైమ్ వర్క్ పర్మిట్ పొందిన తర్వాత ప్రైవేట్ రంగ కార్మికులు రోజుకు గరిష్ఠంగా 4 గంటల పాటు మరొక యజమాని వద్ద పార్ట్టైమ్ పనిన చేసేందుకు అనుమతిస్తారు. రిక్రూట్మెంట్కు ప్రత్యామ్నాయంగా కువైట్లో ప్రస్తుతం ఉన్న శ్రామికశక్తి నుండి ప్రయోజనం పొందాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అథారిటీ తెలిపింది.
దీనితో పాటు ప్రైవేట్ రంగంలో రిమోట్ వర్క్ను అనుమతించాలని, ప్రక్రియను నిర్వహించడానికి నిబంధనలను సిద్ధం చేయాలని పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్పవర్ ను మంత్రి ఆదేశించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..