ఎక్కువ సేపు కదలకుండా కూర్చుంటున్నారా.?
- January 02, 2024పెరిగిన టెక్నాలజీలో భాగంగా ఎలక్ర్టానిక్ గ్యాడ్జిట్స్ ఎక్కువగా వినియోగిస్తుండడం వల్ల స్పైనల్ కార్డ్ (వెన్నెముక) ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తోంది.
ఈ సమస్య నుంచి తప్పించుకోవాలంటే, కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవల్సిందే.
ఎక్కువగా కంప్యూటర్ ముందు కూర్చునే వాళ్లు అరగంటకు ఒకసారి లేచి నాలుగు అడుగులు వేయాల్సి వుంటుంది. అలా చేయడం వల్ల వెన్నెముకపై ఒత్తిడి తగ్గుతుంది.
ఎక్కువ సేపు ఒకే పొజిషన్లో వుండిపోవడం వల్ల వెన్నెముక వద్ద కోర్ కండరాలపై ఒత్తిడి పెరిగి వెన్నెముక బలహీనపడుతుంది. తద్వారా వెన్ను నొప్పి తదితర సమస్యలు వేధిస్తుంటాయ్.
అలాగే బరువైన బ్యాక్ ప్యాక్స్ కంటిన్యూస్గా వేసుకునే అలవాటున్న వారిలోనూ ఈ సమస్యలు ఎక్కువే. చాలా మందిలో ఒక సైడ్ బ్యాక్ ప్యాక్ వేసుకునే అలవాటుంటుంది. అలా చేయడం వల్ల వెన్నెముకపై అసమానమైన ప్రెజర్ పడి వెన్నెముకతో పాటూ దీర్ఘకాలిక భుజం నొప్పులు కూడా బాధిస్తాయ్.
వీలైనంతవరకూ ఆ అలవాటున్నవాళ్లు మార్చుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. అలాగే, స్మార్ట్ ఫోన్లు ఎక్కువగా వాడడం, పడుకుని టీవీ చూసే అలవాటున్న వారిలోనూ వెన్నుముక సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి