ఎక్కువ సేపు కదలకుండా కూర్చుంటున్నారా.?
- January 02, 2024పెరిగిన టెక్నాలజీలో భాగంగా ఎలక్ర్టానిక్ గ్యాడ్జిట్స్ ఎక్కువగా వినియోగిస్తుండడం వల్ల స్పైనల్ కార్డ్ (వెన్నెముక) ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తోంది.
ఈ సమస్య నుంచి తప్పించుకోవాలంటే, కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవల్సిందే.
ఎక్కువగా కంప్యూటర్ ముందు కూర్చునే వాళ్లు అరగంటకు ఒకసారి లేచి నాలుగు అడుగులు వేయాల్సి వుంటుంది. అలా చేయడం వల్ల వెన్నెముకపై ఒత్తిడి తగ్గుతుంది.
ఎక్కువ సేపు ఒకే పొజిషన్లో వుండిపోవడం వల్ల వెన్నెముక వద్ద కోర్ కండరాలపై ఒత్తిడి పెరిగి వెన్నెముక బలహీనపడుతుంది. తద్వారా వెన్ను నొప్పి తదితర సమస్యలు వేధిస్తుంటాయ్.
అలాగే బరువైన బ్యాక్ ప్యాక్స్ కంటిన్యూస్గా వేసుకునే అలవాటున్న వారిలోనూ ఈ సమస్యలు ఎక్కువే. చాలా మందిలో ఒక సైడ్ బ్యాక్ ప్యాక్ వేసుకునే అలవాటుంటుంది. అలా చేయడం వల్ల వెన్నెముకపై అసమానమైన ప్రెజర్ పడి వెన్నెముకతో పాటూ దీర్ఘకాలిక భుజం నొప్పులు కూడా బాధిస్తాయ్.
వీలైనంతవరకూ ఆ అలవాటున్నవాళ్లు మార్చుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. అలాగే, స్మార్ట్ ఫోన్లు ఎక్కువగా వాడడం, పడుకుని టీవీ చూసే అలవాటున్న వారిలోనూ వెన్నుముక సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు
- కువైట్లో బ్యాచిలర్లకు కొత్త కష్టాలు..!
- QR247 మిలియన్లు తిరిగి చెల్లించాలని సీఈఓను ఆదేశించిన కోర్టు
- 2023లో 99%కి చేరుకున్న సౌదీ ఇంటర్నెట్ వినియోగం
- మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం.. అగ్రస్థానంలో భారతీయులు
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ సీజన్..మరో 3 రోజులు పొడిగింపు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం