ఎక్కువ సేపు కదలకుండా కూర్చుంటున్నారా.?
- January 02, 2024
పెరిగిన టెక్నాలజీలో భాగంగా ఎలక్ర్టానిక్ గ్యాడ్జిట్స్ ఎక్కువగా వినియోగిస్తుండడం వల్ల స్పైనల్ కార్డ్ (వెన్నెముక) ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తోంది.
ఈ సమస్య నుంచి తప్పించుకోవాలంటే, కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవల్సిందే.
ఎక్కువగా కంప్యూటర్ ముందు కూర్చునే వాళ్లు అరగంటకు ఒకసారి లేచి నాలుగు అడుగులు వేయాల్సి వుంటుంది. అలా చేయడం వల్ల వెన్నెముకపై ఒత్తిడి తగ్గుతుంది.
ఎక్కువ సేపు ఒకే పొజిషన్లో వుండిపోవడం వల్ల వెన్నెముక వద్ద కోర్ కండరాలపై ఒత్తిడి పెరిగి వెన్నెముక బలహీనపడుతుంది. తద్వారా వెన్ను నొప్పి తదితర సమస్యలు వేధిస్తుంటాయ్.
అలాగే బరువైన బ్యాక్ ప్యాక్స్ కంటిన్యూస్గా వేసుకునే అలవాటున్న వారిలోనూ ఈ సమస్యలు ఎక్కువే. చాలా మందిలో ఒక సైడ్ బ్యాక్ ప్యాక్ వేసుకునే అలవాటుంటుంది. అలా చేయడం వల్ల వెన్నెముకపై అసమానమైన ప్రెజర్ పడి వెన్నెముకతో పాటూ దీర్ఘకాలిక భుజం నొప్పులు కూడా బాధిస్తాయ్.
వీలైనంతవరకూ ఆ అలవాటున్నవాళ్లు మార్చుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. అలాగే, స్మార్ట్ ఫోన్లు ఎక్కువగా వాడడం, పడుకుని టీవీ చూసే అలవాటున్న వారిలోనూ వెన్నుముక సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- బైబ్యాక్ ఆప్షన్, సర్వీస్ ఛార్జీలు లేవు: దుబాయ్ డెవలపర్లు..!!
- రియాద్లో వ్యభిచారం చేస్తున్న ముగ్గురు ప్రవాస మహిళల అరెస్ట్..!!
- దుబాయ్ లూప్: ప్రయాణ సమయాన్ని తగ్గించడానికి హై-స్పీడ్ భూగర్భ రవాణా వ్యవస్థ..!!
- ఫిబ్రవరి 21-22 తేదీలలో ఒమన్ మస్కట్ మారథాన్ 2025..!!
- ఎండోమెంట్ కంపెనీల స్థాపన, లైసెన్సింగ్పై అబుదాబిలో కొత్త నియమాలు..!!
- రమదాన్ ముందు తనిఖీలు.. షువైఖ్లోని తొమ్మిది దుకాణాలకు జరిమానా..!!
- టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని కలిసిన హోమ్ మంత్రి అనిత
- హైదరాబాద్ విమానాశ్రయంలో అధునాతన ల్యాండింగ్ సదుపాయాలు!
- మీరు పోస్టాఫీసులో రోజుకు రూ.50 పెట్టుబడి పెడితే చాలు..
- యూరోపియన్ నేతల అత్యవసర సమావేశం