కెసిఆర్ ను పరామర్శించిన సీఎం జగన్
- January 04, 2024
హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి జగన్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ నివాసానికి చేరుకున్నారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ఆయన బేగంపేట విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో వచ్చారు. ఎయిర్ పోర్టులో బిఆర్ఎస్ నేతలు జగన్ కు స్వాగతం పలికారు. అనంతరం జగన్ అక్కడి నుంచి నేరుగా బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లో ఉన్న కెసిఆర్ నివాసానికి వెళ్లారు. కెసిఆర్ నివాసం వద్ద జగన్ కు కెటిఆర్ ఆహ్వానం పలికి, లోపలకు తీసుకెళ్లారు. ఇటీవల ఆపరేషన్ చేయించుకున్న కెసిఆర్ ను జగన్ పరామర్శించారు. దాదాపు గంటసేపు కెసిఆర్ నివాసంలో జగన్ గడపనున్నారు. లంచ్ మీటింగ్ కూడా ఉందని తెలుస్తోంది. వీరి మధ్య రాజకీయ చర్చలు జరిగే అవకాశం ఉంది. సమావేశం ముగిసిన తర్వాత జగన్ విజయవాడకు తిరుగుపయనమవుతారు.
తాజా వార్తలు
- భారీ లేఆఫ్స్ లేవు..తాత్కాలిక సర్దుబాట్లకే కంపెనీల మొగ్గు!
- ఏప్రిల్ 6 నుండి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించనున్న భారతీయ పాఠశాలలు!
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!
- కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!
- సార్ రోడ్డు ప్రమాద నిందితుడికి 9 ఏళ్ల జైలుశిక్ష ఖరారు..!!
- ఆ దేశాలకు ప్రయాణిస్తే SR30,000 జరిమానా,ట్రావెల్ వ్యాన్..!!
- యూఏఈ విద్యా సంస్థల కీలక నిర్ణయం!
- జీ మెయిల్కి వింత పేర్లు పెడితే అకౌంట్ క్లోజ్









