140 భాషల్లో పాటపాడి గిన్నిస్ రికార్డు సాధించిన సుచేతా సతీశ్
- January 08, 2024
దుబాయ్: దుబాయ్ లో నివసిస్తున్న కేరళకు చెందిన సుచేతా సతీశ్ గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు. దుబాయ్లో గత ఏడాది నవంబర్ 24న జరిగిన కాప్-28 వాతావరణ సదస్సు వేదికగా 140 భాషల్లో పాటలు పాడారు.
ఆమె అద్భుత ప్రదర్శనకు అక్కడున్న వారంతా ఫిదా అయ్యారు. ఆమె సంగీత నైపుణ్యం శ్రోతలను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి హాజరైన గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు ఆమెకు అవార్డును బహూకరించారు. తాజాగా ఆ విషయాన్ని సుచేతా సతీశ్ ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు.
కాంప్-28కి హాజరైన 140 దేశాలకు ప్రతీకగా 140 భాషల్లో పాడినట్లు ఆమె వివరించారు. '' దేవుడి దయతోనే ఈ రికార్డు సాధించాను. 9 గంటల్లో 140 భాషల్లో పాడటం చాలా అదృష్టంగా భావిస్తున్నా. నా వెన్నంటి నిలుస్తూ మద్దతిచ్చిన వారందరికీ ధన్యవాదాలు'' అని సుచేతా పేర్కొన్నారు.
తాజా వార్తలు
- యాదగిరిగుట్ట ఈవోగా భవాని శంకర్
- పార్ట్టైం జాబ్ చేశారనే అనుమానంతో అమెరికాలో ఇండియన్ స్టూడెంట్స్ అరెస్ట్!
- JEE Main 2026 : అడ్మిట్ కార్డులు విడుదల..
- చిన్నస్వామిలో మ్యాచ్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
- ఏపీ గేమ్ ఛేంజర్ గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్..
- అమెరికా: L1 వీసాపై పని లేకుండా ఉంటే ఏమవుతుందో తెలుసా?
- పట్టాలెక్కిన తొలి వందే భారత్ స్లీపర్ రైలు
- అలా చేస్తే వదిలేదే లేదు: సీపీ సజ్జనార్
- మర్డర్ వైరల్ వీడియోపై సౌదీ అరేబియా క్లారిటీ..!!
- బహ్రెయిన్ లో కోల్డ్ మార్నింగ్..పడిపోయిన ఉష్ణోగ్రతలు..!!







