కృష్ణా జిల్లాలో క్రికెట్ మైదానాలు ప్రారంభం..
- May 30, 2016
కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడులో నిర్మించిన రెండు క్రికెట్ మైదానాలను బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ ఈరోజు ప్రారంభించారు. ఆంధ్రా, కృష్ణా జిల్లా క్రికెట్ అసోసియేషన్లు సంయుక్తంగా ఈ మైదానాలు నిర్మించారు. విజయవాడకు కేవలం 25 కిలోమీటర్ల దూరంలోనే ఈ మైదానాలు ఏర్పాటుకావడంతో జాతీయ, అంతర్జాతీయ మ్యాచ్ల నిర్వహణపై స్థానికుల్లో ఆసక్తి నెలకొంది. జాతీయ రహదారి వెంట మూలపాటు త్రిలోచనాపురంలో 13 ఎకరాల్లో రూ.7కోట్ల వ్యయంతో వీటిని నిర్మించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు కేశినేని నాని, గోకరాజు గంగరాజు, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ మైదానాలు ప్రారంభించిన తర్వాత అనురాగ్ ఠాకూర్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు కాసేపు క్రికెట్ ఆడారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







