కృష్ణా జిల్లాలో క్రికెట్‌ మైదానాలు ప్రారంభం..

- May 30, 2016 , by Maagulf
కృష్ణా జిల్లాలో క్రికెట్‌ మైదానాలు ప్రారంభం..

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడులో నిర్మించిన రెండు క్రికెట్‌ మైదానాలను బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్‌ ఠాకూర్‌ ఈరోజు ప్రారంభించారు. ఆంధ్రా, కృష్ణా జిల్లా క్రికెట్‌ అసోసియేషన్లు సంయుక్తంగా ఈ మైదానాలు నిర్మించారు. విజయవాడకు కేవలం 25 కిలోమీటర్ల దూరంలోనే ఈ మైదానాలు ఏర్పాటుకావడంతో జాతీయ, అంతర్జాతీయ మ్యాచ్‌ల నిర్వహణపై స్థానికుల్లో ఆసక్తి నెలకొంది. జాతీయ రహదారి వెంట మూలపాటు త్రిలోచనాపురంలో 13 ఎకరాల్లో రూ.7కోట్ల వ్యయంతో వీటిని నిర్మించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు కేశినేని నాని, గోకరాజు గంగరాజు, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ మైదానాలు ప్రారంభించిన తర్వాత అనురాగ్‌ ఠాకూర్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు కాసేపు క్రికెట్‌ ఆడారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com