యూఏఈలో స్వల్ప భూకంపం
- January 09, 2024
యూఏఈ: సోమవారం అర్థరాత్రి యూఏఈలో రిక్టర్ స్కేలుపై 2.8 తీవ్రతతో స్వల్ప భూకంపం నమోదైందని జాతీయ వాతావరణ కేంద్రం (ఎన్సిఎం) తెలిపింది. నేషనల్ సీస్మిక్ నెట్వర్క్ ప్రకారం.. మసాఫీలో రాత్రి 11.01 గంటలకు భూకంపం నమోదైంది. ప్రకంపనలు నివాసితులకు స్వల్పంగా అనిపించినప్పటికీ ఎటువంటి ప్రభావం చూపలేదని NCM తెలిపింది. నేషనల్ సెంటర్ ఆఫ్ మెటీరియాలజీ (NCM) సిస్మోలజీ విభాగం డైరెక్టర్ ఖలీఫా అల్ ఎబ్రీ మాట్లాడుతూ.. యూఏఈ తక్కువ భూకంప తీవ్రత ఉన్న ప్రదేశంలో ఉందని, అందువల్ల తరచూ స్వల్ప భూకంపానికి లోనవుతుందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. యూఏఈ అరేబియా టెక్టోనిక్ ప్లేట్పై ఉందని, ఇది యురేషియన్ ప్లేట్కు వ్యతిరేకంగా ఉందని అల్ ఎబ్రీ వివరించారు.
తాజా వార్తలు
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్
- పిల్లలను కొట్టొద్దు..పేరెంట్స్ కు దుబాయ్ పోలీసులు సలహా..!!
- 24వేల రవాణా సంస్థలను హెచ్చరించిన TGA..!!
- టూర్ ఆఫ్ ఫ్లాండర్స్ సైక్లిస్టులకు జరిమానాలు..!!
- వదంతులను నమ్మొద్దు..ప్రజలకు క్యాబినెట్ విజ్ఞప్తి..!!
- ఖతార్ లో విద్యాసంస్థల సెలవులు పొడిగింపు..!!
- ప్రాంతీయ పరిణామాలపై కువైట్, ఒమన్ చర్చలు..!!









