యూఏఈలో స్వల్ప భూకంపం
- January 09, 2024
యూఏఈ: సోమవారం అర్థరాత్రి యూఏఈలో రిక్టర్ స్కేలుపై 2.8 తీవ్రతతో స్వల్ప భూకంపం నమోదైందని జాతీయ వాతావరణ కేంద్రం (ఎన్సిఎం) తెలిపింది. నేషనల్ సీస్మిక్ నెట్వర్క్ ప్రకారం.. మసాఫీలో రాత్రి 11.01 గంటలకు భూకంపం నమోదైంది. ప్రకంపనలు నివాసితులకు స్వల్పంగా అనిపించినప్పటికీ ఎటువంటి ప్రభావం చూపలేదని NCM తెలిపింది. నేషనల్ సెంటర్ ఆఫ్ మెటీరియాలజీ (NCM) సిస్మోలజీ విభాగం డైరెక్టర్ ఖలీఫా అల్ ఎబ్రీ మాట్లాడుతూ.. యూఏఈ తక్కువ భూకంప తీవ్రత ఉన్న ప్రదేశంలో ఉందని, అందువల్ల తరచూ స్వల్ప భూకంపానికి లోనవుతుందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. యూఏఈ అరేబియా టెక్టోనిక్ ప్లేట్పై ఉందని, ఇది యురేషియన్ ప్లేట్కు వ్యతిరేకంగా ఉందని అల్ ఎబ్రీ వివరించారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధి పై సుంకాలు ఉండవు..అమెరికాకు తెలిపిన ఇరాన్
- సైబర్ నేరాల నియంత్రణ పై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి
- కువైట్లో పశువుల షెడ్డులో ఘర్షణ.. ముగ్గురికి గాయాలు, ముగ్గురు అరెస్ట్
- వెనెజువెలాలో భూకంప భీభత్సం..
- భారత క్రికెట్ చరిత్రను మార్చిన రోజు
- క్రెడిట్ కార్డు యూజర్లకు RBI గుడ్ న్యూస్
- సమ్మర్ లో ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లెక్సిబుల్ టైమింగ్స్: దుబాయ్
- జెడ్డాలో 12 లైసెన్సు లేని వాటర్ బాట్లింగ్ ప్లాంట్లు సీజ్..!!
- యూఏఈ లాటరీ: Dh100,000 బహుమతి గెలిచిన ముగ్గురు విజేతలు..!!
- ముగిసిన సంక్షోభం..భారీగా ఖర్చు పెడుతున్న కువైట్ కన్జుమర్స్..!!







