అమెరికాకు బహ్రెయిన్ కీలక భాగస్వామి: బ్లింకెన్ కీలక వ్యాఖ్యలు
- January 11, 2024
బహ్రెయిన్: అమెరికాకు బహ్రెయిన్ కీలక భాగస్వామి అని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ వ్యాఖ్యానించారు. ఆయన బహ్రెయిన్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. పలు అంశాలపై ఆయన సమాధానాలు ఇచ్చారు. గాజాలో ఇప్పుడు కొనసాగుతున్న సంఘర్షణ ఇతర ప్రదేశాలకు వ్యాపించకుండా చూసుకోవడంపై తాము దృష్టి సారించామన్నారు. ఎర్ర సముద్రంలో షిప్పింగ్కు సంబంధించి హౌతీల నుండి వస్తున్న దురాక్రమణపై ధీటుగా స్పందిస్తున్నట్లు తెలిపారు. ఇరాన్ సహాయంతోనే ఈ దాడులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. కమర్షియల్ షిప్పింగ్కు వ్యతిరేకంగా హౌతీల దాడుల కారణంగా వేలాది ఓడలు దారి మళ్లించాల్సి వచ్చిందన్నారు. ఇంధనం, ఔషధం, ఆహారం వరకు ప్రతిదానికీ ప్రజలపై అధిక ధరల భారం పడుతుందన్నారు. ఎర్ర సముద్రంలో నౌకాయాన స్వేచ్ఛను, షిప్పింగ్ స్వేచ్ఛను సంరక్షించడానికి తాము చేయగలిగినదంతా చేస్తామని తెలిపారు. యునైటెడ్ స్టేట్స్ మరియు యునైటెడ్ కింగ్డమ్ - ఆపరేషన్ ప్రాస్పిరిటీ గార్డియన్లో ఇద్దరు భాగస్వాములు అని గుర్తుచేశారు. గాజాలో మానవతా సహాయం అందేలా చేయడం తమ విధానమన్నారు. ఇదే విధానంపై త్వరలో పాలస్తీనా అధ్యక్షుడు అబ్బాస్, ఈజిప్టు అధ్యక్షుడు సిసితో, జోర్డాన్ రాజు అబ్దుల్లాతో మాట్లాడుతున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు







