అటల్ సేతు బ్రిడ్జ్ను ప్రారంభించిన ప్రధాని మోదీ
- January 12, 2024
ముంబై: ముంబైలో సముద్రంపై నిర్మించిన దేశంలోని అతిపెద్ద బ్రిడ్జ్ను ఇవాళ ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ బ్రిడ్జ్ను అటల్ సేతు(Atal Setu)గా పిలువనున్నారు.
ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ అని కూడా దీన్ని పిలుస్తున్నారు. ఈ బ్రిడ్జ్ సుమారు 21.8 కిలోమీటర్ల పొడుగు ఉంది. బ్రిడ్జ్ పూర్తి పేరు అటల్ బిహారీ వాజ్పేయి సేవారి-నహవా సేవా అటల్ సేతు. సుమారు 17,840 కోట్ల ఖర్చుతో దీన్ని నిర్మించారు. దక్షిణ ముంబై నుంచి నవీ ముంబైని ఈ బ్రిడ్జ్ కనెక్ట్ చేస్తుంది. దాదాపు రెండున్నర గంటల జర్నీని కేవలం 20 నిమిషాలకు కుదిస్తోంది.
భారత్లోనే అతిపొడువైన బ్రిడ్జ్గా దీన్ని గుర్తిస్తున్నారు. ఇక దేశంలో సముద్రంపై నిర్మించిన అతిపెద్ద బ్రిడ్జ్ కూడా ఇదే కానున్నది. డిసెంబర్ 2016లో ప్రధాని మోదీనే ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి శంకుశస్థాపన చేశారు. ముంబై పోర్టు నుంచి జవహర్లాల్ నెహ్రూ పోర్టు మధ్య దూరాన్ని కూడా తగ్గిస్తుంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..