ఎన్టీఆర్‌కు నివాళులర్పించిన తారక్‌, కల్యాణ్‌రామ్‌

- January 18, 2024 , by Maagulf
ఎన్టీఆర్‌కు నివాళులర్పించిన తారక్‌, కల్యాణ్‌రామ్‌

హైదరాబాద్‌: నేడు టిడిపి వ్యవస్థాపకుడు, దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ వర్ధంతి ఈసందర్భంగా ఆయన మనవళ్లు జూనియర్‌ ఎన్టీఆర్ నివాళులర్పించారు. గురువారం తెల్లవారుజామున సోదరుడు కల్యాణ్‌రామ్‌తో కలిసి హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌ వద్ద ఉన్న ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకున్న తారక్‌.. ఆయన సమాధి వద్ద పుష్పగుచ్చాలు ఉంచి అంజలి ఘటించారు. మరోవైపు.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించేందుకు భారీ సంఖ్యలో టిడిపి శ్రేణులు, ఎన్టీఆర్ అభిమానులు చేరుకోవడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొన్నది.

కాగా, ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద ఏర్పాటుచేసిన జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్లెక్సీలను బాలకృష్ణ అభిమానులు తొలగించడం వివాదానికి దారితీసింది. తెల్లవారుజామున ఎన్టీఆర్‌.. తాతకు నివాళులర్పించి వెళ్లారు. అనంతరం అక్కడికి కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులతో కలిసి బాలకృష్ణ చేరుకున్నారు. ఆయన అంజలి ఘటించిన వెళ్లిన తర్వాత.. టిడిపి కార్యకర్తలు, బాలకృష్ణ అభిమానులు.. అక్కడున్న తారక్‌ ఫ్లెక్సీలు, కటౌట్‌లను తొలగించి పక్కకు పెట్టారు. దీనిపై ఎన్టీఆర్‌ అభిమానులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com