ఇండియాకు వెళ్లే వందలాది విమానాలు రద్దు
- January 18, 2024
యూఏఈ: ఇండియాలో ఉన్న ప్రతికూల వాతావరణం కారణంగా అనేక విమానాలు రద్దవుతున్నాయి. దీంతో ఇండియాకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భోపాల్లోని తన అనారోగ్యంతో ఉన్న తన తండ్రిని చూసేందుకు న్యూఢిల్లీకి ప్లైట్ బుక్ చేసుకుంటే అది చివరి క్షణంలో రద్దయిందని, దాంతో ముంబైకి వెళ్లేందుకు ఫ్లైట్ బుక్ చేసుకుంటే అది కూడా రెండు గంటల ఆలస్యం అయిందని సాదియా అన్వర్ తెలిపారు. స్మార్ట్ ట్రావెల్స్ జనరల్ మేనేజర్ సఫీర్ మహమూద్ మాట్లాడుతూ.. “గత రెండు రోజుల్లో భారతదేశానికి వెళ్లే 150కి పైగా విమానాలు రద్దు చేయబడ్డాయి లేదా ఆలస్యం అయ్యాయి. న్యూఢిల్లీ విమానాశ్రయం వద్ద అత్యంత దారుణమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. దాంతో దేశీయ మరియు అంతర్జాతీయ విమానాలను ప్రభావితం చేసింది.’’ అని వివరించారు. రతదేశంలోని కొన్ని నగరాలు ముఖ్యంగా న్యూ ఢిల్లీ పరిసరాల్లో పొగమంచు అధికంగా ఉందన్నారు. ఇది విమాన రాకపోకలను గణనీయంగా ప్రభావితం చేసిందన్నారు. విమానాలు రద్దువుతుండటంతో కొంత మంది ప్రయాణికులు తమ ఆవేదనను సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తున్నారు. సోమవారం విమానం 10 గంటలు ఆలస్యం అయిన నేపథ్యంలో పైలట్ను ఓ వ్యక్తి చెంపదెబ్బ కొట్టిన వీడియో వైరల్గా మారింది. మరోవైపు భారత పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా.. పరిస్థితిని ఎదుర్కోవటానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని ట్వీట్ చేశారు. ప్రయాణీకుల సమస్యలను పరిష్కరించడానికి ఆరు విమానాశ్రయాలలో వార్ రూమ్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!