రెసిడెన్సీ ఉల్లంఘించిన వారి బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్!
- January 21, 2024
కువైట్: ప్రవాస రెసిడెన్సీ ఉల్లంఘించిన వారికి క్షమాభిక్ష వ్యవధిని కువైట్ ఇప్పటివరకు ప్రకటించలేదు. గతంలో ఇటువంటి చర్యలు ప్రభావవంతంగా అమలు కాలేదన అధికార వర్గాలు చెబుతున్నాయి. స్థానిక నివేదిక ప్రకారం.. 2020కి ముందు రెసిడెన్సీ ఉల్లంఘించిన వారికి క్షమాభిక్ష కల్పించే ప్రణాళికను మంత్రిత్వ శాక తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం గతంలో క్షమాభిక్ష ప్రకటించబడిన సందర్భాల్లో ఉల్లంఘించినవారు తమ స్థితిని సరిదిద్దుకునే అవకాశాన్ని వదులుకున్నారని, ఉల్లంఘించిన వారు కువైట్ను వదిలిపోయేందుకు నిరాకరించారని తెలిపింది. కొత్తగా తీసుకున్న నిర్ణయం ప్రకారం.. రెసిడెన్సీ ఉల్లంఘన జరిమానా, బహిష్కరణ ఖర్చు నేరుగా బ్యాంక్ ఖాతాల నుండి డిడక్ట్ చేసేందుకు వీలుగా రెసిడెన్సీ ఉల్లంఘనదారుల బ్యాంక్ ఖాతాను ఫ్రీజ్ చేయాలని బ్యాంకులను అభ్యర్థించనున్నారు. జరిమానా చెల్లించడానికి తమ వద్ద నిధులు లేవని తెలిపే వ్యక్తులను అడ్డుకునేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు 2020కి ముందు రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన ప్రవాసులు జరిమానాలు చెల్లించడానికి మరియు వారి స్థితిని సర్దుబాటు చేయడానికి అనుమతించేలా గత వారం తీసుకున్న నిర్ణయాన్ని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాత్కాలికంగా నిలిపివేసింది.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







