రెసిడెన్సీ ఉల్లంఘించిన వారి బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్!
- January 21, 2024
కువైట్: ప్రవాస రెసిడెన్సీ ఉల్లంఘించిన వారికి క్షమాభిక్ష వ్యవధిని కువైట్ ఇప్పటివరకు ప్రకటించలేదు. గతంలో ఇటువంటి చర్యలు ప్రభావవంతంగా అమలు కాలేదన అధికార వర్గాలు చెబుతున్నాయి. స్థానిక నివేదిక ప్రకారం.. 2020కి ముందు రెసిడెన్సీ ఉల్లంఘించిన వారికి క్షమాభిక్ష కల్పించే ప్రణాళికను మంత్రిత్వ శాక తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం గతంలో క్షమాభిక్ష ప్రకటించబడిన సందర్భాల్లో ఉల్లంఘించినవారు తమ స్థితిని సరిదిద్దుకునే అవకాశాన్ని వదులుకున్నారని, ఉల్లంఘించిన వారు కువైట్ను వదిలిపోయేందుకు నిరాకరించారని తెలిపింది. కొత్తగా తీసుకున్న నిర్ణయం ప్రకారం.. రెసిడెన్సీ ఉల్లంఘన జరిమానా, బహిష్కరణ ఖర్చు నేరుగా బ్యాంక్ ఖాతాల నుండి డిడక్ట్ చేసేందుకు వీలుగా రెసిడెన్సీ ఉల్లంఘనదారుల బ్యాంక్ ఖాతాను ఫ్రీజ్ చేయాలని బ్యాంకులను అభ్యర్థించనున్నారు. జరిమానా చెల్లించడానికి తమ వద్ద నిధులు లేవని తెలిపే వ్యక్తులను అడ్డుకునేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు 2020కి ముందు రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన ప్రవాసులు జరిమానాలు చెల్లించడానికి మరియు వారి స్థితిని సర్దుబాటు చేయడానికి అనుమతించేలా గత వారం తీసుకున్న నిర్ణయాన్ని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాత్కాలికంగా నిలిపివేసింది.
తాజా వార్తలు
- ఏవియేషన్ విద్యార్థులకు అంతర్జాతీయ ఇంటర్న్షిప్ అవకాశం
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్
- పిల్లలను కొట్టొద్దు..పేరెంట్స్ కు దుబాయ్ పోలీసులు సలహా..!!
- 24వేల రవాణా సంస్థలను హెచ్చరించిన TGA..!!
- టూర్ ఆఫ్ ఫ్లాండర్స్ సైక్లిస్టులకు జరిమానాలు..!!
- వదంతులను నమ్మొద్దు..ప్రజలకు క్యాబినెట్ విజ్ఞప్తి..!!
- ఖతార్ లో విద్యాసంస్థల సెలవులు పొడిగింపు..!!









