దుబాయ్లో ప్రతిరోజూ 500 చెట్లను నాటిన అథారిటీ
- January 22, 2024
యూఏఈ: గత సంవత్సరం నగరంలో 185,000 కంటే ఎక్కువ చెట్లను నాటినట్లు దుబాయ్ మునిసిపాలిటీ వెల్లడించింది. ప్రతిరోజు సగటున 500చెట్లను నాటింది. దీంతో 234 హెక్టార్లలో గ్రీనరీని అథారిటీ పెంచింది. ఇది 2022లో 170 హెక్టార్లుగా ఉంది. రోడ్లు మరియు ఉద్యానవనాలు సహా 210 ప్రదేశాలలో చెట్లను నాటారు. స్థానిక రకాల్లో ఘఫ్, సిద్ర్, సుమర్, వేప, ఆలివ్, సమోరోవా పామ్, ఇండియన్ జాస్మిన్ మరియు తాటి చెట్లను నాటినట్లు అథారిటీ తెలిపింది. అలాగే ఆకుపచ్చ ఆకులకు ప్రసిద్ధి చెందిన చెట్లలో వాషింగ్టోనియా, బిస్మార్కియా, సూడోబాంబాక్స్, పోయిన్సియానా, బౌగెన్విల్లె, అకేసియా ఫర్నేసియానా మరియు డార్సినా వంటి చెట్లకు ప్రాధాన్యత ఇచ్చినట్లు దుబాయ్ మునిసిపాలిటీ డైరెక్టర్ జనరల్ దావూద్ అల్ హజ్రీ తెలిపారు. పచ్చని ప్రదేశాలు పర్యావరణ పరిరక్షణతోపాటు నివాసితులు, పర్యాటకులకు ఆహ్లాదాన్ని అందజేస్తాయన్నారు.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









