దుబాయ్లో ప్రతిరోజూ 500 చెట్లను నాటిన అథారిటీ
- January 22, 2024
యూఏఈ: గత సంవత్సరం నగరంలో 185,000 కంటే ఎక్కువ చెట్లను నాటినట్లు దుబాయ్ మునిసిపాలిటీ వెల్లడించింది. ప్రతిరోజు సగటున 500చెట్లను నాటింది. దీంతో 234 హెక్టార్లలో గ్రీనరీని అథారిటీ పెంచింది. ఇది 2022లో 170 హెక్టార్లుగా ఉంది. రోడ్లు మరియు ఉద్యానవనాలు సహా 210 ప్రదేశాలలో చెట్లను నాటారు. స్థానిక రకాల్లో ఘఫ్, సిద్ర్, సుమర్, వేప, ఆలివ్, సమోరోవా పామ్, ఇండియన్ జాస్మిన్ మరియు తాటి చెట్లను నాటినట్లు అథారిటీ తెలిపింది. అలాగే ఆకుపచ్చ ఆకులకు ప్రసిద్ధి చెందిన చెట్లలో వాషింగ్టోనియా, బిస్మార్కియా, సూడోబాంబాక్స్, పోయిన్సియానా, బౌగెన్విల్లె, అకేసియా ఫర్నేసియానా మరియు డార్సినా వంటి చెట్లకు ప్రాధాన్యత ఇచ్చినట్లు దుబాయ్ మునిసిపాలిటీ డైరెక్టర్ జనరల్ దావూద్ అల్ హజ్రీ తెలిపారు. పచ్చని ప్రదేశాలు పర్యావరణ పరిరక్షణతోపాటు నివాసితులు, పర్యాటకులకు ఆహ్లాదాన్ని అందజేస్తాయన్నారు.
తాజా వార్తలు
- రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే
- గూగుల్ మ్యాప్స్లో సరికొత్త AI ఫీచర్లు
- ఇండిగో ప్రయాణికులకు ‘ఇంధన’ భారం
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!









