ఎయిరిండియాలోకి కొత్త ఎయిర్బస్ ఎ350-900
- January 22, 2024న్యూఢిల్లీ: ఎయిరిండియా కొత్తగా కొనుగోలు చేసిన ఎయిర్బస్ ఎ350-900 వాణిజ్య సేవలను ప్రారంభించింది. ఈ విమానాన్ని దేశంలోనే తొలిసారి ఎయిరిండియా ప్రవేశపెట్టింది.
హైదరాబాద్లో జరిగిన వింగ్స్ ఇండియా -2024లోనూ ప్రదర్శించింది. దీంతో సోమవారం బెంగళూరు, ముంబయిల మధ్య సేవలను ప్రారంభించింది. ఎఐ589 ప్లయిట్ నెంబర్తో బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఉదయం 7.05 గంటలకు ప్రారంభమై.. 8.50 గంటలకు ముంబయికి చేరుకుంది. తదుపరి దశల్లో చెన్నరు, ముంబయి, హైదరాబాద్ సేవలకు ఉపయోగించనుంది. డిజిసిఎ అనుమతుల తర్వాత తదుపరి అంతర్జాతీయ సర్వీసులకు వినియోగించనుంది. ఇందులో 28 ప్రయివేటు బిజినెస్ సూట్లు సహా మొత్తం 350 సీట్లు ఉన్నాయి. ఈ విమానంతో 20 శాతం ఇంధనం ఆదా కానుందని ఇటీవల ఎయిర్బస్ వెల్లడించింది.
తాజా వార్తలు
- యూఏఈ ప్రయాణ వ్యాక్సిన్లు: అవసరమైన జాబ్లు, ఖర్చులు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి