శ్రామికులకు సరిపోని 3 గంటల మధ్యాహ్న విరామం

- June 29, 2015 , by Maagulf
శ్రామికులకు సరిపోని 3 గంటల మధ్యాహ్న విరామం

 

పవిత్ర రమదాన్ మాసంలో ఉపవాసదీక్ష చేసే శ్రామికులకు మధ్యాహ్న విరామంగా 3 గంటల వ్యవధి సరిపోదని చెపుతున్న పైద్య ప్రముఖుల వాదన ప్రాముఖ్యతను సంతరించుకుంది.

ఆరుబయట పనిచేసే శ్రామికులకు ఉపవాసదీక్ష పెద్ద పరీక్ష.  పెరిగిన తేమ శాతం వలన శరీరం అలసిపోతుంది. అంతేకాకుండా, ద్రవ పదార్ధాలు కూడా తీసుకోనందున డీ -హైడ్రేషన్తో వడదెబ్బ తగలవచ్చు. శరీరంలోని ముఖ్య భాగాలైన మెదడు, కీడ్నీలు, హృదయం వంటి ముఖ్య అవయవాలపై ఇది ప్రభావం చూపుతుందని, చెమట పట్టకపోవడం, నీటిని స్వీకరించకపోవడం వంటి పరిస్థితుల వలన శరీర మెటబాలిసమ్ కూడా దెబ్బతినవచ్చునని ఆయన వివరించారు. అందువలన 12 నుండి 3 గంటల విరామం కాకుండా, చిన్న చిన్న పరిమాణాలు గల షిఫ్ట్ లు ఆరుబయట పనిచేసేవారికి సరైనవని దుబాయిలోని అస్తార్ మెడికల్ సెంటర్ జనరల్ ప్రాక్టీషనర్ డా. రోడేరిక్ ఫెర్నాండో అభిప్రాయపడ్డారు.

 

--సి.శ్రీ(దుబాయ్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com