భారత్, సౌదీ అరేబియా సంయుక్త సైనిక విన్యాసాలు షురూ..
- January 29, 2024
భారత్, సౌదీ అరేబియాల సంయుక్త సైనిక విన్యాసాలు రాజస్థాన్లో సోమవారం ప్రారంభమయ్యాయి. ఇరు దేశాల మధ్య సైనిక సహకారాన్ని మరింతగా పెంచుకోవడానికి తమ తొలి సంయుక్త విన్యాసాలను ప్రారంభించినట్టు ఇండియన్ ఆర్మీ తెలిపింది.
'సదా తన్సీక్' పేరుతో చేపట్టే ఈ విన్యాసాలు ఫిబ్రవరి 10వరకు కొనసాగనున్నాయి. ఇందులో సౌదీ అరేబియా నుంచి 45 మంది, భారత ఆర్మీకి చెందిన 45 మంది సైనికులతో కూడిన బ్రిగేడ్ ఆఫ్ ది గార్డ్స్ పాల్గొననున్నారు. ఈ డ్రిల్స్లో మొబైల్ వెహికల్ చెక్ పోస్ట్లు, కార్డెన్ సెర్చ్ ఆపరేషన్లు, హౌస్ ఇంటర్వెన్షన్ డ్రిల్స్, రిఫ్లెక్స్ షూటింగ్, స్లిథరింగ్, స్నిపర్ ఫైరింగ్ల ఏర్పాటు ఉంటుంది. 'యునైటెడ్ నేషన్స్ చార్టర్ VII అధ్యాయం ప్రకారం సెమీ-ఎడారి భూభాగంలో ఉమ్మడి కార్యకలాపాల కోసం దళాలకు శిక్షణ ఇవ్వడం ఈ వ్యాయామం లక్ష్యం. ఇది ఇరు దేశాల సైనికుల మధ్య పరస్పర చర్య, బంధుత్వం, స్నేహాన్ని పెంపొందించడానికి దోహదపడుతుంది' అని ఆర్మీ పేర్కొంది.
తాజా వార్తలు
- 14 వేల మందిని ఇంటికి సాగనంపుతున్న అమెజాన్
- ఇరాన్ వీడాలని భారతీయులకు కేంద్రం ఆదేశం..
- ఇరాన్ 10 షరతులు ఇవే..
- వడ్డీరేట్ల పై ఆర్బీఐ కీలక నిర్ణయం..
- టెంపుల్ టూరిజం పై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్
- గాజువాక మౌనిక హత్య కేసులో ట్విస్ట్..
- క్రూడాయిల్ ధరలు ఢమాల్
- సౌదీ అరేబియాలో పెరగనున్న సాధారణ ఉష్ణోగ్రతలు..!!
- KD10 మించిన నగదు లావాదేవీల పై నిషేధం..!!
- వీగిన బహ్రెయిన్ సముద్ర భద్రతా తీర్మానం..రష్యా,చైనా వీటో..!!









