విష్ణువర్థన్ ను గ్రాఫిక్స్ సాయంతో హీరోగా..
- May 31, 2016
అమ్మోరు, అంజి, అరుంధతి లాంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ దర్శకుడు కోడి రామకృష్ణ. అరుంధతి సినిమా తరువాత పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఈ క్రియేటివ్ డైరెక్టర్ కొద్ది రోజులుగా తెలుగు ఇండస్ట్రీలో కనిపించటం మానేశాడు. తెలుగు తెర మీద సక్సెస్ దూరం కావటంతో కన్నడలో ఓ స్టార్ హీరోతో సినిమాను తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు.అయితే కోడి రామకృష్ణ ప్రస్తుతం తెరకెక్కిస్తున్న సినిమాలో హీరో కన్నడ స్టార్ విష్ణువర్ధన్. 2009లోనే చనిపోయిన విష్ణువర్థన్ ఇప్పుడు హీరోగా ఎలా నటిస్తున్నాడని అనుకుంటున్నారా..? అప్పట్లో కలిసుందాం రా.. యమదొంగ లాంటి సినిమాల కోసం ఎన్టీఆర్ ను మరోసారి తెరమీద చూపించినట్టుగా.., ఈ సినిమాలో విష్ణువర్థన్ ను గ్రాఫిక్స్ సాయంతో హీరోగా చూపించబోతున్నారు.అప్పట్లో అవి కేవలం ఒక సీన్కు లేదా ఒక పాటకు మాత్రమే పరిమితం అయ్యేవి. కానీ చనిపోయిన నటుడు హీరోగా ఓ పూర్తి స్థాయి సినిమాను తెరకెక్కించటం భారతీయ సినీ చరిత్రలో ఇదే తొలిసారి కావటం విశేషం. 1972లో విష్ణువర్థన్ హీరోగా తెరకెక్కిన నాగరాహువు సినిమాను తరువాత ఉపేంద్ర హీరోగా రీమేక్ చేసి విజయం సాధించారు. ఇప్పుడు మరోసారి అదే సినిమాను అదే పేరుతో విష్ణువర్ధన్ హీరోగా తెరకెక్కిస్తున్నారు. చనిపోయిన విష్ణువర్ధన్ ను ఈ సినిమాలో హీరోగా చూపించటం కోసం ఏడు దేశాల్లోని 576 మంది గ్రాఫిక్స్ నిపుణులు 730 రోజుల పాటు శ్రమించారట. ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా జూలై నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









