'మోహిని' అనే మరో హర్రర్ చిత్రంలో త్రిష..
- June 01, 2016
ప్రస్తుతం టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు హర్రర్ చిత్రాలకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ జోనర్ సినిమాల్లో నటించేందుకు స్టార్ హీరోలు, హీరోయిన్లు సైతం అమితాసక్తి చూపిస్తుండటంతో ప్రపంచ వ్యాప్తంగా వందల్లో హర్రర్ చిత్రాల నిర్మాణం జరుగుతోంది. టాలీవుడ్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అలాగే కోలీవుడ్లోనూ బోల్డెన్ని హర్రర్ చిత్రాలు ప్రేక్షకుల్ని అలరించేందుకు రెడీ అవుతున్నాయి. నిన్న మొన్నటివరకు గ్లామర్ పాత్రలతో ఆడియెన్స్ ని ఆకట్టుకున్న త్రిష ఈసారి భయపెట్టేందుకు రెండు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన 'నాయకి' ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంటే, మాదేష్ దర్శకత్వంలో 'మోహిని' అనే మరో హర్రర్ చిత్రంలో నటించేందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.ఈనెలలోనే షూటింగ్ ప్రారంభించుకునే ఈచిత్రానికి 'హారీ పొట్టర్' విఎఫెక్స్ టీమ్ పనిచేయనుంది. సూపర్ నేచురల్ పవర్స్ నేపథ్యంలో తెరకెక్కే ఈ హర్రర్ చిత్రాన్ని యుకె, థారులాండ్, మెక్సికో దేశాల్లో చిత్రీకరించనున్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







