'మోహిని' అనే మరో హర్రర్ చిత్రంలో త్రిష..
- June 01, 2016
ప్రస్తుతం టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు హర్రర్ చిత్రాలకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ జోనర్ సినిమాల్లో నటించేందుకు స్టార్ హీరోలు, హీరోయిన్లు సైతం అమితాసక్తి చూపిస్తుండటంతో ప్రపంచ వ్యాప్తంగా వందల్లో హర్రర్ చిత్రాల నిర్మాణం జరుగుతోంది. టాలీవుడ్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అలాగే కోలీవుడ్లోనూ బోల్డెన్ని హర్రర్ చిత్రాలు ప్రేక్షకుల్ని అలరించేందుకు రెడీ అవుతున్నాయి. నిన్న మొన్నటివరకు గ్లామర్ పాత్రలతో ఆడియెన్స్ ని ఆకట్టుకున్న త్రిష ఈసారి భయపెట్టేందుకు రెండు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన 'నాయకి' ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంటే, మాదేష్ దర్శకత్వంలో 'మోహిని' అనే మరో హర్రర్ చిత్రంలో నటించేందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.ఈనెలలోనే షూటింగ్ ప్రారంభించుకునే ఈచిత్రానికి 'హారీ పొట్టర్' విఎఫెక్స్ టీమ్ పనిచేయనుంది. సూపర్ నేచురల్ పవర్స్ నేపథ్యంలో తెరకెక్కే ఈ హర్రర్ చిత్రాన్ని యుకె, థారులాండ్, మెక్సికో దేశాల్లో చిత్రీకరించనున్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









