'మోహిని' అనే మరో హర్రర్ చిత్రంలో త్రిష..
- June 01, 2016
ప్రస్తుతం టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు హర్రర్ చిత్రాలకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ జోనర్ సినిమాల్లో నటించేందుకు స్టార్ హీరోలు, హీరోయిన్లు సైతం అమితాసక్తి చూపిస్తుండటంతో ప్రపంచ వ్యాప్తంగా వందల్లో హర్రర్ చిత్రాల నిర్మాణం జరుగుతోంది. టాలీవుడ్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అలాగే కోలీవుడ్లోనూ బోల్డెన్ని హర్రర్ చిత్రాలు ప్రేక్షకుల్ని అలరించేందుకు రెడీ అవుతున్నాయి. నిన్న మొన్నటివరకు గ్లామర్ పాత్రలతో ఆడియెన్స్ ని ఆకట్టుకున్న త్రిష ఈసారి భయపెట్టేందుకు రెండు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన 'నాయకి' ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంటే, మాదేష్ దర్శకత్వంలో 'మోహిని' అనే మరో హర్రర్ చిత్రంలో నటించేందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.ఈనెలలోనే షూటింగ్ ప్రారంభించుకునే ఈచిత్రానికి 'హారీ పొట్టర్' విఎఫెక్స్ టీమ్ పనిచేయనుంది. సూపర్ నేచురల్ పవర్స్ నేపథ్యంలో తెరకెక్కే ఈ హర్రర్ చిత్రాన్ని యుకె, థారులాండ్, మెక్సికో దేశాల్లో చిత్రీకరించనున్నారు.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







