ఏపీ వాలంటీర్లకు శుభవార్త..

- February 12, 2024 , by Maagulf
ఏపీ వాలంటీర్లకు శుభవార్త..

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ సర్కార్ లో పనిచేస్తున్న వాలంటీర్లకు శుభవార్త. త్వరలోనే సీఎం జగన్ ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న వాలంటీర్స్ అందరికీ 10 వేల రూపాయిల నుండి 30 వేల రూపాయిల వరకు ఇవ్వబోతున్నాడు.

'సేవా మిత్ర' పధకం క్రింద రాష్ట్రంలో ఉన్న వాలంటీర్లు గుహ ఐదేళ్లుగా ప్రభుత్వ పథకాలను చిత్తశుద్ధితో యాలకు చేరుస్తూ, వాళ్లకి అన్నీ విధాలుగా చేదోడు వాదోడుగా నిలుస్తూ వచ్చినందుకు గుర్తుగా జగన్ ఈ 'సేవ మిత్ర' ద్వారా డబ్బులు అందించబోతున్నాడు. ప్రతీ మండలం లో ఐదుగురు, అలాగే ప్రతీ మున్సిపాలిటీలో 10 మందికి 20 వేల రూపాయిలు, నియోజకవర్గం లో ఐదుగురిని గుర్తించి 'సేవా వజ్ర' క్రింద 30 వేల రూపాయిలు, ఇక మిగిలిన వాలంటీర్స్ కి సేవా మిత్ర క్రింద 10 వేల రూపాయిలు అందించబోతున్నాడు. ఈ కార్యక్రమంని ఈనెల 15 వ తారీఖున గుంటూరు జిల్లాలోని ఫిరంగిపురం లో జరగబొయ్యే సభలో సీఎం జగన్ అందించబోతున్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com