మలేషియా ప్రధానమంత్రితో అబ్దుల్లా కమెల్ కీలక సమావేశం
- February 25, 2024
జెడ్డా: ఇస్లామిక్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ అండ్ అగ్రికల్చర్ అధ్యక్షుడు షేక్ అబ్దుల్లా సలేహ్ కమెల్ శుక్రవారం కౌలాలంపూర్లో మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో ఇస్లామిక్ ఛాంబర్ సెక్రటరీ జనరల్ యూసఫ్ ఖలావి, డాక్టర్ ఫసిహర్ హసన్ అబ్దుల్ రజాక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మలేషియాలో ముఖ్యంగా సౌదీ కంపెనీలకు సంబంధించిన పెట్టుబడి అవకాశాలపై షేక్ అబ్దుల్లా కమెల్ కు వివరించారు. 2023 సంవత్సరంలో మలేషియా తన చరిత్రలో అత్యధిక పెట్టుబడి రేటును 329.5 బిలియన్ మలేషియా రింగ్గిట్లతో సాధించిందని ఆయన వివరించారు. సౌదీ అరేబియాలో పెట్టుబడులు పెట్టేందుకు మలేషియా పారిశ్రామికవేత్తలకు అవకాశాలను కల్పించడం వల్ల మలేషియా కంపెనీలు, శ్రామిక శక్తి వృద్ధి చెందడంతోపాటు వివిధ దేశాల నుండి నైపుణ్యాలను పొందడం ఖాయమని ప్రధాని అన్వర్ వెల్లడించారు.
తాజా వార్తలు
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!









