మలేషియా ప్రధానమంత్రితో అబ్దుల్లా కమెల్ కీలక సమావేశం
- February 25, 2024
జెడ్డా: ఇస్లామిక్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ అండ్ అగ్రికల్చర్ అధ్యక్షుడు షేక్ అబ్దుల్లా సలేహ్ కమెల్ శుక్రవారం కౌలాలంపూర్లో మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో ఇస్లామిక్ ఛాంబర్ సెక్రటరీ జనరల్ యూసఫ్ ఖలావి, డాక్టర్ ఫసిహర్ హసన్ అబ్దుల్ రజాక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మలేషియాలో ముఖ్యంగా సౌదీ కంపెనీలకు సంబంధించిన పెట్టుబడి అవకాశాలపై షేక్ అబ్దుల్లా కమెల్ కు వివరించారు. 2023 సంవత్సరంలో మలేషియా తన చరిత్రలో అత్యధిక పెట్టుబడి రేటును 329.5 బిలియన్ మలేషియా రింగ్గిట్లతో సాధించిందని ఆయన వివరించారు. సౌదీ అరేబియాలో పెట్టుబడులు పెట్టేందుకు మలేషియా పారిశ్రామికవేత్తలకు అవకాశాలను కల్పించడం వల్ల మలేషియా కంపెనీలు, శ్రామిక శక్తి వృద్ధి చెందడంతోపాటు వివిధ దేశాల నుండి నైపుణ్యాలను పొందడం ఖాయమని ప్రధాని అన్వర్ వెల్లడించారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







