వాటర్ బెలున్స్ విసిరితే..500 దీనార్ల వరకు జరిమానా
- February 25, 2024
కువైట్: వాటర్ బెలున్స్ విసిరితే 500 దీనార్ల వరకు జరిమానా విధించబడుతుంది. ఈ మేరకు పర్యావరణ పబ్లిక్ అథారిటీ యొక్క తాత్కాలిక డైరెక్టర్ జనరల్ సమీరా అల్-కందారి హెచ్చరించారు. పౌరులు మరియు ప్రవాసులు కువైట్లో జాతీయ సెలవుదిన వేడుకల్లో పరిశుభ్రతను కాపాడాలని పిలుపునిచ్చారు. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ లా ఆర్టికల్ 33కి అనుగుణంగా బెలూన్ పారవేయడంతోపాటు చెత్తను వేయకుండా ఉండాలని, ఉల్లంఘించిన వారికి 50 నుండి 500 దీనార్ల జరిమానా విధించనున్నట్లు అల్-కందారి తెలిపారు. పర్యావరణ నిబంధనలను అమలు చేయడానికి ఏజెన్సీల సిబ్బందితో సహా ఇన్స్పెక్టర్ల బృందాలు వేడుక జరిగే ప్రదేశాలలో సంయుక్త తనిఖీలు నిర్వహిస్తాయని తెలిపారు. జాతీయ సెలవు రోజులలో కాలుష్యాన్ని తగ్గించడానికి, అవగాహన పెంచడానికి దేశవ్యాప్తంగా పర్యావరణ అధికారుల ప్రత్యేక బృందాన్ని నియమించినట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







