తెలుగు సినీ రచయిత సిరాశ్రీకి గౌరవ డాక్టరేట్
- February 26, 2024
దుబాయ్: అమెరికాలోని వయోమింగ్ కేంద్రంగా గల గ్లోరీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ 2024 కి గాను దుబాయ్ లో గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేసింది. ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను, సేవాతత్పరులను గుర్తించి డాక్టరేట్లను ఇవ్వడం జరిగింది.
భారత్, పాకిస్తాన్, యూ,ఎ.ఈ, నేపాల్, కెనెడా, ఈజిప్ట్, ఐవొరీ కోస్ట్ దేశాలకు చెందిన 23 మందికి ఈ గౌరవ డాక్టరేట్లను స్నాతకోత్సవంలో ప్రదానం చేయడం జరిగింది.
దుబాయ్ లో జరిగిన ఈ వేదుకలో గౌరవ డాక్టరేట్ ను అందుకున్న ఏకైక తెలుగు ప్రముఖుడు సినీగీత రచయిత సిరాశ్రీ. వృత్తిపరంగానే కాకుండా సమాజహితం కోరి ఆయన చేసిన పలు రచనలను గుర్తించి ఈ గౌరవ డాక్టరేట్ తో సత్కరించడం జరిగింది.
ఐవొరీ కోస్ట్ దేశ రాయబారి వకాబే డయాబి, యూ.ఎ.ఈ నేషనల్ డైరెక్టర్ డా.నాసెర్ సులేమాన్, యూనివెర్సిటీ ఆఫ్రికా డైరెక్టర్ సాంసన్ హెర్మన్, డి.ఎస్.టీ టీవీ-సినిమా మేనేజింగ్ డైరెక్టర్ డా అన్వర్ అలి తదితరులు దుసిట్ థాని హోటల్లో ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొని గౌరవడాక్టరేట్లను అందజేసారు.
తాజా వార్తలు
- అబుదాబిలో డ్రైవర్కు జైలు శిక్ష.. 70,000 దిర్హమ్ల ఫైన్..!!
- సౌదీ అరేబియాకు పలు గల్ఫ్, అరబ్ దేశాలు సంతాపం..!!
- కువైట్ లో464 మంది ప్రవాసుల చిరునామాలు రద్దు..!!
- యాంటీడ్రగ్ వ్యతిరేక అవగాహన ప్రదర్శన ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో ‘రీఅష్యూర్డ్ హోమ్స్’ తో కుటుంబాలకు ఉపశమనం..!!
- సమ్మర్ వర్కింగ్ అవర్స్ వయోలేషన్ రిపోర్టుకు ప్రత్యేక ఛానెల్స్..!!
- GMR ఏరోస్పేస్ పార్క్లో ఎఫ్టీజీ తొలి భారత తయారీ కేంద్రం ప్రారంభం
- అయోధ్య రామాలయ నిధుల స్కామ్ నిందితులు వీరే!
- ఖతార్లో నిల్వ ఉన్న ఇరాన్కు చెందిన 6 బిలియన్ డాలర్ల నిధులు విడుదల కానున్నాయి: ఇరాన్
- హైదరాబాద్-చెన్నై ఇక 2 గంటల్లోనే!







