తెలుగు సినీ రచయిత సిరాశ్రీకి గౌరవ డాక్టరేట్

- February 26, 2024 , by Maagulf
తెలుగు సినీ రచయిత సిరాశ్రీకి గౌరవ డాక్టరేట్

దుబాయ్: అమెరికాలోని వయోమింగ్ కేంద్రంగా గల గ్లోరీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ 2024 కి గాను దుబాయ్ లో గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేసింది. ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను, సేవాతత్పరులను గుర్తించి డాక్టరేట్లను ఇవ్వడం జరిగింది. 

భారత్, పాకిస్తాన్, యూ,ఎ.ఈ, నేపాల్, కెనెడా, ఈజిప్ట్, ఐవొరీ కోస్ట్ దేశాలకు చెందిన 23 మందికి ఈ గౌరవ డాక్టరేట్లను స్నాతకోత్సవంలో ప్రదానం చేయడం జరిగింది. 

దుబాయ్ లో జరిగిన ఈ వేదుకలో గౌరవ డాక్టరేట్ ను అందుకున్న ఏకైక తెలుగు ప్రముఖుడు సినీగీత రచయిత సిరాశ్రీ. వృత్తిపరంగానే కాకుండా సమాజహితం కోరి ఆయన చేసిన పలు రచనలను గుర్తించి ఈ గౌరవ డాక్టరేట్ తో సత్కరించడం జరిగింది. 

ఐవొరీ కోస్ట్ దేశ రాయబారి వకాబే డయాబి, యూ.ఎ.ఈ నేషనల్ డైరెక్టర్ డా.నాసెర్ సులేమాన్,  యూనివెర్సిటీ ఆఫ్రికా డైరెక్టర్ సాంసన్ హెర్మన్, డి.ఎస్.టీ టీవీ-సినిమా మేనేజింగ్ డైరెక్టర్ డా అన్వర్ అలి తదితరులు దుసిట్ థాని హోటల్లో ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొని గౌరవడాక్టరేట్లను అందజేసారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com