‘ఆపరేషన్ వాలైంటైన్’.! కేవలం సినిమా కాదిది.!
- February 29, 2024
ఇంతవరకూ ఏ తెలుగు హీరో చేయని సాహసంగా పేర్కొంటున్నారు ‘ఆపరేషన్ వాలైంటైన్’ సినిమాలో వరుణ్ తేజ్ పాత్రని. పుల్వామా దాడి నేపథ్యంలో రూపొందిన తొలి తెలుగు ఎయిర్ ఫోర్స్ నేపథ్యం కథనమే ‘ఆపరేషన్ వాలైంటైన్’.
ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ చాలా చాలా కష్టపడ్డాడు. ఆయన కెరీర్లో వస్తున్న తొలి ప్యాన్ ఇండియా చిత్రం కూడా ఇదే. నిజానికి ఇది సినిమా కాదు, ఇదో సాహసమే.. కాదు కాదు, తెలుగు జాతికి గర్వ కారణం.. అంటూ ‘ఆపరేషన్ వాలైంటైన్’ గురించి మాట్లాడుతున్నారు.
డైరెక్టర్ శక్తి ప్రతాప్ సింహా ఉత్తరాది కుర్రోడు. ఆయన మన టాలీవుడ్ హీరో అయిన వరుణ్ తేజ్కి ఈ కథ చెప్పినప్పుడు మొదట వరుణ్కి భయమేసిందట. కానీ, కటౌట్ పరంగా ఈ సినిమాలో వరుణ్నే హీరోగా తీసుకోవాలని గట్టిగా అనుకున్నాడట ప్రతాప్ సింగ్.
అలా ఫైనల్లీ ఈ ప్రాజెక్ట్ సెట్ అయ్యింది. ఈ ప్రాజెక్ట్ని పట్టాలెక్కించేందుకు ప్రతాప్ సింగ్ చాలా చాలా గ్రౌండ్ వర్క్ చేశాడట. పూర్తిగా ఎయిర్ ఫోర్స్ గురించి తెలుసుకున్నాకే సినిమాని పట్టాలెక్కించాడట. అందుకు చాలానే టైమ్ కూడా తీసుకున్నాడట.
అలాగే, వరుణ్ తేజ్ హిందీ డబ్బింగ్ కోసం రెండు నెలలు ట్యూటర్ని పెట్టుకుని హిందీ స్పష్టంగా నేర్చుకుని మరీ డబ్బింగ్ చెప్పాడట. బాలీవుడ్ బ్యూటీ మానుషి చిల్లర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. రేపు అనగా మార్చి 1న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









