భారత్, అఫ్ఘానిస్థాన్ ల సంబంధాల్లో మరో ముందడుగు..

- June 04, 2016 , by Maagulf
భారత్, అఫ్ఘానిస్థాన్ ల సంబంధాల్లో మరో ముందడుగు..

భారత్, అఫ్ఘానిస్థాన్ ల సంబంధాల్లో మరో ముందడుగు పడింది. భారత్-అఫ్ఘానిస్థాన్ ఫ్రెండ్ షిప్ డ్యామ్ ను ప్రారంభించారు. హెరాత్ లో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో భారత్ ప్రధాని నరేంద్ర మోదీ అఫ్ఘాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనితో కలసి ఆవిష్కరించారు.ఐదు దేశాల పర్యటనలో భాగంగా ఈ రోజు మోదీ ఢిల్లీ నుంచి బయల్దేరి అఫ్ఘాన్ చేరుకున్నారు. హెరాత్ లో మోదీకి ఘనస్వాగతం లభించింది. అనంతరం ఘనితో కలసి మోదీ భారత్-అఫ్ఘానిస్థాన్ ఫ్రెండ్ షిప్ డ్యామ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. అప్ఘాన్ పురోభివృద్ధిలో ఇది మరో ముందడుగు అని అన్నారు. గతేడాది డిసెంబర్ లో కాబుల్ లో అఫ్ఘాన్ పార్లమెంట్ భవనం ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నానని చెప్పారు.ఈ డ్యామ్ ను ఇరు దేశాల స్నేహబంధం, విశ్వాసంతో నిర్మించినదని పేర్కొన్నారు. ఐదు దేశాల పర్యటనలో భాగంగా మోదీ అఫ్ఘాన్ తో పాటు స్విట్జర్లాండ్, మెక్సికో, ఖతార్, అమెరికా దేశాలకు వెళతారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com