భారత్, అఫ్ఘానిస్థాన్ ల సంబంధాల్లో మరో ముందడుగు..
- June 04, 2016
భారత్, అఫ్ఘానిస్థాన్ ల సంబంధాల్లో మరో ముందడుగు పడింది. భారత్-అఫ్ఘానిస్థాన్ ఫ్రెండ్ షిప్ డ్యామ్ ను ప్రారంభించారు. హెరాత్ లో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో భారత్ ప్రధాని నరేంద్ర మోదీ అఫ్ఘాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనితో కలసి ఆవిష్కరించారు.ఐదు దేశాల పర్యటనలో భాగంగా ఈ రోజు మోదీ ఢిల్లీ నుంచి బయల్దేరి అఫ్ఘాన్ చేరుకున్నారు. హెరాత్ లో మోదీకి ఘనస్వాగతం లభించింది. అనంతరం ఘనితో కలసి మోదీ భారత్-అఫ్ఘానిస్థాన్ ఫ్రెండ్ షిప్ డ్యామ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. అప్ఘాన్ పురోభివృద్ధిలో ఇది మరో ముందడుగు అని అన్నారు. గతేడాది డిసెంబర్ లో కాబుల్ లో అఫ్ఘాన్ పార్లమెంట్ భవనం ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నానని చెప్పారు.ఈ డ్యామ్ ను ఇరు దేశాల స్నేహబంధం, విశ్వాసంతో నిర్మించినదని పేర్కొన్నారు. ఐదు దేశాల పర్యటనలో భాగంగా మోదీ అఫ్ఘాన్ తో పాటు స్విట్జర్లాండ్, మెక్సికో, ఖతార్, అమెరికా దేశాలకు వెళతారు.
తాజా వార్తలు
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!







