దుబాయ్ పోలీస్ - రమదాన్ ట్రాఫిక్ అలర్ట్
- June 04, 2016
రమదాన్ సందర్భంగా రోడ్లపై ప్రమాదకర రీతిలో వాహనాలు నడిపేవారిపై వాహనదారులు, పాదచారులు అప్రమత్తంగా ఉండాలని ట్రాఫిక్ జనరల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కల్నల్ సైఫ్ ముహైర్ అల్ మజ్రోయ్ పిలుపునిచ్చారు. నిబంధనల్ని అతిక్రమించి వాహనాలు నడిపేవారి గురించి పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. గత రమదాన్ సమయంలో 201 ట్రాఫిక్ యాక్సిడెంట్లు జరిగాయనీ, ఈ ప్రమాదాల్లో 10 మంది మృతి చెందగా, 147 మంది గాయపడ్డారని ఆయన వివరించారు. 8004353 నెంబరుకి కాల్ చేసి ఎవరైనా ట్రాఫిక్ ఉల్లంఘనలపై ఫిర్యాదు చేయొచ్చన్నారు. రోడ్లపై భద్రతకుగాను ప్రత్యేక టీమ్లు పనిచేస్తాయనీ, ముఖ్యమైన సమయాల్లో భద్రతను కట్టుదిట్టం చేస్తామని వివరించారు. ప్రధాన రోడ్లపైనా ఇంటర్నల్ రోడ్లపైనా పోలీస్ పెట్రోల్స్ కొనసాగుతాయని కల్నల్ మజ్రోయ్ చెప్పారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







