'డా.నూర్ అమ్రోహ్వి అవార్డు' అందుకున్న నజ్నీన్ అలీ నాజ్
- March 18, 2024
కువైట్: కువైట్ లోని భారతీయ కవయిత్రి నజ్నీన్ అలీ నాజ్ ముంబైలోని అవామీ రాయ్ నుండి ప్రతిష్టాత్మక "డా. నూర్ అమ్రోహ్వి అవార్డు" అందుకున్నారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అవార్డు ప్రదానోత్సవం జరిగింది. ప్రముఖ వారపత్రిక అవామీ రాయ్ అంతర్జాతీయ కవితా కార్యక్రమాన్ని నిర్వహించింది, ఇందులో ప్రముఖ ఉర్దూ కవులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉర్దూ భాషను ప్రోత్సహించడంలో మరియు ప్రచారం చేయడంలో ఆమె చేసిన కృషికి గాను కువైట్కు చెందిన రచయిత్రి, కవయిత్రి నజ్నీన్ అలీ నాజ్కు డాక్టర్ నూర్ అమ్రోహ్వి అవార్డును అందజేశారు. డాక్టర్ యూసుఫ్ అబ్రాహ్ని, డాక్టర్ సుహైల్ లోఖండ్వాలా, డాక్టర్ మహమ్మద్ అలీ పాటింకర్, డాక్టర్ ఫాతిమా పాటింకర్, డాక్టర్ అల్లావుద్దీన్ షేక్, పద్మశ్రీ డాక్టర్ జహీర్ కాజీ, స్థానిక ఎమ్మెల్యే అమీన్ పటేల్ చేతుల మీదుగా ఆమె ఈ అవార్డును అందుకుంది. నజ్నీన్ వృత్తిరీత్యా బ్యాంకర్ అయినప్పటికీ, సాహిత్యంపై తన ఆసక్తిని కొనసాగించింది. ఆమె ప్రధానంగా ఉర్దూ కవయిత్రి, ఆమె ఉర్దూ మరియు హిందీలో "ఖలీష్" అనే నవల కూడా రాసింది. గతంలో షాన్ ఇ ఉర్దూ అవార్డు, సాహిర్ లూధియాన్వి అవార్డు, సుభద్ర కుమారి అవార్డు, దినకర్ అవార్డు మొదలైన పలు ప్రతిష్టాత్మక అవార్డులను అందుకుంది.
తాజా వార్తలు
- అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్
- అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!









