తెలంగాణలో వర్షాలు..
- March 18, 2024
హైదరాబాద్: నేటి నుంచి 4 రోజులపాటు తెలంగాణలో పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ మేరకు వాతావరణశాఖ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
అకాల వర్షాల కారణంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. శనివారం రాత్రి నుంచి కురిసిన వడగళ్ల వర్షంతో వరి, గోధుమ, ఉల్లి, జొన్న, పొగాకు, నువ్వులు, కూరగాయల పంటలు నాశనమయ్యాయి. మామిడి, బొప్పాయి తోటలు దెబ్బతిన్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొత్తం 26,129 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని అధికారులు గుర్తించారు.
తాజా వార్తలు
- వనపర్తిలో అంబులెన్స్ ప్రారంభం..నిరుపేదలకు ఉచిత ఆటోలు పంపిణీ చేసిన సోనుసూద్
- 100 రోజులు.. స్థిరత్వాన్ని కాపాడుకున్న గల్ఫ్ దేశాలు..!!
- ప్రపంచవ్యాప్తంగా హ్యుమటేరియన్ సేవల్లో కువైట్ ఛారిటీస్..!!
- యూఏఈ లాటరీ డ్రా..ఒక్కొక్కరు Dh50,000 గెలుచుకున్నముగ్గురు విజేతలు..!!
- ఆన్లైన్ పర్యాటక మోసాలపై సౌదీ ఎంబసీ హెచ్చరిక..!!
- మహిళను సురక్షితంగా తరలించిన ఆర్ఓపి ఏవియేషన్..!!
- భారతీయ మహిళకు అండగా నిలిచిన ఇండియన్ ఎంబసీ..!!
- 'మీ సురక్ష–కలిసి ఉంటే కలదు సుఖం' కార్యక్రమం ఘనంగా నిర్వహణ
- దేశంలో జీవనశైలి వ్యాధులు పెరుగుతున్న ఆందోళనకర పరిస్థితి: గవర్నర్ అబ్దుల్ నజీర్
- ప్రైవేట్ ట్రావెల్స్ ప్రతినిధులతో సైబరాబాద్ సీపీ సమావేశం









