తెలంగాణలో వర్షాలు..
- March 18, 2024
హైదరాబాద్: నేటి నుంచి 4 రోజులపాటు తెలంగాణలో పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ మేరకు వాతావరణశాఖ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
అకాల వర్షాల కారణంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. శనివారం రాత్రి నుంచి కురిసిన వడగళ్ల వర్షంతో వరి, గోధుమ, ఉల్లి, జొన్న, పొగాకు, నువ్వులు, కూరగాయల పంటలు నాశనమయ్యాయి. మామిడి, బొప్పాయి తోటలు దెబ్బతిన్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొత్తం 26,129 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని అధికారులు గుర్తించారు.
తాజా వార్తలు
- డైమండ్ ఎగ్జామినేషన్ ప్రోగ్రామ్ ను ప్రారంభించిన ఖతార్..!!
- సౌదీలోని పలు ప్రాంతాలలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- ఇండిగో సంక్షోభం కంటిన్యూ..డొమెస్టిక్ సర్వీసెస్ క్యాన్సిల్..!!
- స్పెషల్ అట్రాక్షన్.. అల్-మసీలా బీచ్లో ఫియస్టా సిటీ..!!
- బహ్రెయిన్ ఫెస్టివల్ను ప్రారంభించిన షేక్ మొహమ్మద్..!!
- ‘అరబ్ గవర్నమెంట్ ఎక్సలెన్స్ అవార్డు’ అందుకున్న ఒమన్..!!
- ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు
- అమరావతి అభివృద్ధికి వేగం: కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్
- తిరుమలలో కీలక మార్పులు...
- పుతిన్కు భగవద్గీతను అందించిన ప్రధాని మోదీ







