సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్ దాఖలు
- March 18, 2024
న్యూ ఢిల్లీ: సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ జరుగుతుండగానే తనను అరెస్టు చేశారని, దర్యాప్తు సంస్థ కోర్టుకు ధిక్కరణకు పాల్పడిందని ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దర్యాప్తు సంస్థపై తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గతంలో విచారణ సందర్భంగా సమన్లు జారీచేయబోమని కోర్టుకు చెపి అక్రమంగా తనను అరెస్టు చేశారని అందులో పేర్కొన్నారు. ఈ మేరకు కవిత తరఫు న్యాయవాది మోహిత్ రావు సోమవారం ఉదయం 6.30 గంటలకు ఆన్లైన్లో పిటిషన్ వేశారు.
కాగా, ఆదివారం ఎమ్మెల్సీ కవితను ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారించారు. విచారణ సందర్భంగా ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చినట్టుసమాచారం. విచారణను అధికారులు వీడియో రికార్డు చేసినట్టు తెలిసింది. విచారణ అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు, ఆమె భర్త అనిల్, న్యాయవాది మోహిత్రావు కవితను కలిశారు. అధికారులు అడిగిన ప్రశ్నలకు తాను సమాధానం చెప్తూనే తనపై మోపిన అభియోగాలన్నీ అభియోగాలుగానే మిగిలిపోతాయని, తాను కడిగిన ముత్యంలా బయటికొస్తానని ఆమె వారితో పేర్కొన్నట్టు సమాచారం. కాగా, సోమవారం ఎమ్మెల్సీ కవిత సమీప బంధువులు, ఆమె వ్యక్తిగత సిబ్బంది కొందరు ఆమెను కలిసే అవకాశం ఉన్నది.
తాజా వార్తలు
- వనపర్తిలో అంబులెన్స్ ప్రారంభం..నిరుపేదలకు ఉచిత ఆటోలు పంపిణీ చేసిన సోనుసూద్
- 100 రోజులు.. స్థిరత్వాన్ని కాపాడుకున్న గల్ఫ్ దేశాలు..!!
- ప్రపంచవ్యాప్తంగా హ్యుమటేరియన్ సేవల్లో కువైట్ ఛారిటీస్..!!
- యూఏఈ లాటరీ డ్రా..ఒక్కొక్కరు Dh50,000 గెలుచుకున్నముగ్గురు విజేతలు..!!
- ఆన్లైన్ పర్యాటక మోసాలపై సౌదీ ఎంబసీ హెచ్చరిక..!!
- మహిళను సురక్షితంగా తరలించిన ఆర్ఓపి ఏవియేషన్..!!
- భారతీయ మహిళకు అండగా నిలిచిన ఇండియన్ ఎంబసీ..!!
- 'మీ సురక్ష–కలిసి ఉంటే కలదు సుఖం' కార్యక్రమం ఘనంగా నిర్వహణ
- దేశంలో జీవనశైలి వ్యాధులు పెరుగుతున్న ఆందోళనకర పరిస్థితి: గవర్నర్ అబ్దుల్ నజీర్
- ప్రైవేట్ ట్రావెల్స్ ప్రతినిధులతో సైబరాబాద్ సీపీ సమావేశం









