మహేష్తో రాజమౌళి ఇప్పట్లో తేల్చేలా లేడుగా.!
- March 19, 2024
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రాజమౌళి తీయబోయే సినిమా సూపర్ స్టార్ మహేష్బాబుతో వుంటుందని అప్పట్లోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విడుదలై దాదాపు ఏడాది కావస్తున్నా.. ఇంకా ఈ సినిమా మేనియా నుంచి రాజమౌళి బయటపడలేదు.
ఈ లోపే అడపా దడపా ఆయన తదుపరి సినిమా గురించి కూడా వార్తలు గాసిప్స్ రూపంలో గుప్పుమంటున్నాయ్. ఈ నేపథ్యంలోనే త్వరలోనే మహేష్బాబుతో సినిమా స్టార్ట్ అవుతుందనీ.. పలానా వాళ్లు నటీనటులుగా సెలెక్ట్ అయ్యారన్న వార్తలు వినిపిస్తున్నాయ్.
కానీ, ఇంకా అలాంటిదేమీ లేదనీ, ఇంతవరకూ ఈ ప్రాజెక్ట్కి సంబంధించి కేవలం మహేష్బాబు మాత్రమే ఓకే అయ్యారనీ మిగిలిన నటీ నటుల విషయంలో చర్చోపచర్చలు జరుగుతున్నాయంతే.. ఎవ్వరూ ఫైనల్ కాలేదనీ తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాజమౌళి స్పష్టత ఇచ్చారు.
ఇంతవరకూ ఈ సినిమాలో హీరోయిన్గా కరీనా కపూర్ నటిస్తుందనీ, కాదు కాదు, దీపిక పదుకొనె అనీ, కాదు జాన్వీ కపూర్.. అనీ విలన్గా హృతిక్ రోషన్ నటిస్తున్నాడనీ వార్తలు వినిపించాయ్. కానీ, అందులో ఎలాంటి నిజం లేదనీ జక్కన్న తెలిపారు. ప్రస్తుతానికి స్ర్కిప్ట్ వర్క్ మాత్రమే కంప్లీట్ అయ్యిందని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు