విమానాశ్రయంలో మొట్టమొదటి రన్వే ఇఫ్తార్
- March 21, 2024
దుబాయ్: విమానాలు టేకాఫ్ మరియు డౌన్ అవుతుండగా.. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (DXB)లోని ఉద్యోగుల బృందం రన్వేపై మొట్టమొదటిసారిగా ఇఫ్తార్ను నిర్వహించింది. ఈ మేరకు బుధవారం DXB ఓ వీడియో షేర్ చేసింది. ఇందులో వివిధ దేశాల సిబ్బంది టార్మాక్పై ఇఫ్తార్ టేబుల్ను ఏర్పాటు చేశారు. ఖర్జూరాలు, పండ్లు, స్వీట్లు, రిఫ్రెష్ పానీయాలు మరియు సాంప్రదాయ అరబిక్ వంటకాలతో సహా సంప్రదాయ రంజాన్ ట్రీట్లను అక్కడ ఏర్పాటు చేశారు. మా బృంద సభ్యుల మధ్య బలమైన స్నేహ భావాన్ని మరియు పరస్పర గౌరవాన్ని పెంపొందించామని దుబాయ్ ఎయిర్పోర్ట్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మజేద్ అల్ జోకర్ పేర్కొన్నారు.
DXB ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది గత సంవత్సరం 86.9 మిలియన్ల మంది ప్రయాణికులను స్వాగతించింది. ఇది 102 అంతర్జాతీయ క్యారియర్ల ద్వారా 104 దేశాలలో 262 గమ్యస్థానాలకు నెట్ వర్క కలిగి ఉంది. DXB ఈ సంవత్సరం 88.8 మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలు అందింస్తుందని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- నేటి నుంచి గుణదల మేరీమాత ఉత్సవాలు
- ఖతార్ లో వెయ్యి వస్తువుల ధరలు తగ్గింపు..!!
- మస్కట్ లో INSV కౌండిన్యకు ఘనంగా వీడ్కోలు..!!
- 2025లో సౌదీలో రెమిటెన్స్ రికార్డు..15శాతం వృద్ధి..!!
- ట్రాఫిక్ కు చెక్..అల్ ఖుద్రాలో కొత్త 4-లేన్ల బ్రిడ్జి ప్రారంభం..!!
- సల్మానియా మెడికల్ కాంప్లెక్స్లో అగ్నిప్రమాదం..తప్పిన పెనుప్రమాదం..!!
- ఫహాహీల్ ఎక్స్ ప్రెస్వే ఫాస్ట్ లేన్ 15 రోజుల పాటు మూసివేత..!!
- పోస్టాఫీస్లో అద్భుతమైన స్కీమ్..
- నోబెల్ గ్రహీత నర్గెస్కు మరో ఏడున్నరేళ్ల జైలు
- భారత దేశంలో తొలి సమగ్ర అవయవ మార్పిడి సంస్థ









