విమానాశ్రయంలో మొట్టమొదటి రన్వే ఇఫ్తార్
- March 21, 2024
దుబాయ్: విమానాలు టేకాఫ్ మరియు డౌన్ అవుతుండగా.. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (DXB)లోని ఉద్యోగుల బృందం రన్వేపై మొట్టమొదటిసారిగా ఇఫ్తార్ను నిర్వహించింది. ఈ మేరకు బుధవారం DXB ఓ వీడియో షేర్ చేసింది. ఇందులో వివిధ దేశాల సిబ్బంది టార్మాక్పై ఇఫ్తార్ టేబుల్ను ఏర్పాటు చేశారు. ఖర్జూరాలు, పండ్లు, స్వీట్లు, రిఫ్రెష్ పానీయాలు మరియు సాంప్రదాయ అరబిక్ వంటకాలతో సహా సంప్రదాయ రంజాన్ ట్రీట్లను అక్కడ ఏర్పాటు చేశారు. మా బృంద సభ్యుల మధ్య బలమైన స్నేహ భావాన్ని మరియు పరస్పర గౌరవాన్ని పెంపొందించామని దుబాయ్ ఎయిర్పోర్ట్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మజేద్ అల్ జోకర్ పేర్కొన్నారు.
DXB ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది గత సంవత్సరం 86.9 మిలియన్ల మంది ప్రయాణికులను స్వాగతించింది. ఇది 102 అంతర్జాతీయ క్యారియర్ల ద్వారా 104 దేశాలలో 262 గమ్యస్థానాలకు నెట్ వర్క కలిగి ఉంది. DXB ఈ సంవత్సరం 88.8 మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలు అందింస్తుందని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







