విమానాశ్రయంలో మొట్టమొదటి రన్వే ఇఫ్తార్
- March 21, 2024దుబాయ్: విమానాలు టేకాఫ్ మరియు డౌన్ అవుతుండగా.. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (DXB)లోని ఉద్యోగుల బృందం రన్వేపై మొట్టమొదటిసారిగా ఇఫ్తార్ను నిర్వహించింది. ఈ మేరకు బుధవారం DXB ఓ వీడియో షేర్ చేసింది. ఇందులో వివిధ దేశాల సిబ్బంది టార్మాక్పై ఇఫ్తార్ టేబుల్ను ఏర్పాటు చేశారు. ఖర్జూరాలు, పండ్లు, స్వీట్లు, రిఫ్రెష్ పానీయాలు మరియు సాంప్రదాయ అరబిక్ వంటకాలతో సహా సంప్రదాయ రంజాన్ ట్రీట్లను అక్కడ ఏర్పాటు చేశారు. మా బృంద సభ్యుల మధ్య బలమైన స్నేహ భావాన్ని మరియు పరస్పర గౌరవాన్ని పెంపొందించామని దుబాయ్ ఎయిర్పోర్ట్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మజేద్ అల్ జోకర్ పేర్కొన్నారు.
DXB ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది గత సంవత్సరం 86.9 మిలియన్ల మంది ప్రయాణికులను స్వాగతించింది. ఇది 102 అంతర్జాతీయ క్యారియర్ల ద్వారా 104 దేశాలలో 262 గమ్యస్థానాలకు నెట్ వర్క కలిగి ఉంది. DXB ఈ సంవత్సరం 88.8 మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలు అందింస్తుందని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్