అల్లు అర్జున్ సినిమా కోసం ఓ బడా నిర్మాణ సంస్థ వెయిటింగ్.!
- April 02, 2024
‘పుష్ప 2’ సినిమా తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓ ప్యాన్ఇండియా సినిమాలో నటించబోతున్నారు. ఈ సినిమాకి తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహించబోతున్నాడు.
ఎప్పుడో ఈ సినిమా అనౌన్స్మెంట్ జరిగింది. కానీ, ఇంతవరకూ పట్టాలెక్కలేదు. అయితే, ముందుగా కమిట్ అయిన ప్రాజెక్టులు (పుష్ప 2) పూర్తి చేశాకే ఈ భారీ ప్రాజెక్టుపై అల్లు అర్జున్ ఫోకస్ పెట్టబోతున్నారు.
త్వరలోనే ‘పుష్ప 2’ కంప్లీట్ కానుంది. ఆగస్టులో ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయ్. కాగా, అట్లీ సినిమాని హోమ్ బ్యానర్ అయిన గీతా ఆర్ట్స్ 2లో నిర్మించేందుకు సిద్ధమవుతున్నారట.
అయితే, ఇంతవరకూ గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో పెద్ద సినిమాలేమీ రూపొందింది లేదు. కానీ, ఈ బ్యానర్ని ఇంకాస్త ఎత్తుకు తీసుకెళ్లాలంటే ఓ ప్రతిష్టాత్మక చిత్రం రూపొందాల్సిన ఆవశ్యకత ఎంతైనా వుంది. అందుకే తన సినిమానే ఈ బ్యానర్లో రూపొందించాలనుకుంటున్నారట.
అయితే, మరో ప్రముఖ నిర్మాణ సంస్థతో కలిసి అల్లు అర్జున్ ఈ నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఆ నిర్మాణ సంస్థ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగం పంచుకోనుందట. ఆల్రెడీ ఆ విషయమై మంతనాలు కూడా జరుగుతున్నాయట. అదేంటో త్వరలో వెల్లడి కానుంది.
తాజా వార్తలు
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన
- గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్ రోడ్ ప్రతిపాదనపై సీఎం రేవంత్
- బహ్రెయిన్, యూఏఈ పై ఇరాన్ కామెంట్స్..జీసీసీ సీరియస్..!!
- ఖతార్ లో నేషనల్ వాలంటీర్ వర్క్ ల్యాబ్ ప్రారంభం..!!







