అల్లు అర్జున్ సినిమా కోసం ఓ బడా నిర్మాణ సంస్థ వెయిటింగ్.!
- April 02, 2024
‘పుష్ప 2’ సినిమా తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓ ప్యాన్ఇండియా సినిమాలో నటించబోతున్నారు. ఈ సినిమాకి తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహించబోతున్నాడు.
ఎప్పుడో ఈ సినిమా అనౌన్స్మెంట్ జరిగింది. కానీ, ఇంతవరకూ పట్టాలెక్కలేదు. అయితే, ముందుగా కమిట్ అయిన ప్రాజెక్టులు (పుష్ప 2) పూర్తి చేశాకే ఈ భారీ ప్రాజెక్టుపై అల్లు అర్జున్ ఫోకస్ పెట్టబోతున్నారు.
త్వరలోనే ‘పుష్ప 2’ కంప్లీట్ కానుంది. ఆగస్టులో ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయ్. కాగా, అట్లీ సినిమాని హోమ్ బ్యానర్ అయిన గీతా ఆర్ట్స్ 2లో నిర్మించేందుకు సిద్ధమవుతున్నారట.
అయితే, ఇంతవరకూ గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో పెద్ద సినిమాలేమీ రూపొందింది లేదు. కానీ, ఈ బ్యానర్ని ఇంకాస్త ఎత్తుకు తీసుకెళ్లాలంటే ఓ ప్రతిష్టాత్మక చిత్రం రూపొందాల్సిన ఆవశ్యకత ఎంతైనా వుంది. అందుకే తన సినిమానే ఈ బ్యానర్లో రూపొందించాలనుకుంటున్నారట.
అయితే, మరో ప్రముఖ నిర్మాణ సంస్థతో కలిసి అల్లు అర్జున్ ఈ నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఆ నిర్మాణ సంస్థ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగం పంచుకోనుందట. ఆల్రెడీ ఆ విషయమై మంతనాలు కూడా జరుగుతున్నాయట. అదేంటో త్వరలో వెల్లడి కానుంది.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







