అల్లు అర్జున్ సినిమా కోసం ఓ బడా నిర్మాణ సంస్థ వెయిటింగ్.!
- April 02, 2024
‘పుష్ప 2’ సినిమా తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓ ప్యాన్ఇండియా సినిమాలో నటించబోతున్నారు. ఈ సినిమాకి తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహించబోతున్నాడు.
ఎప్పుడో ఈ సినిమా అనౌన్స్మెంట్ జరిగింది. కానీ, ఇంతవరకూ పట్టాలెక్కలేదు. అయితే, ముందుగా కమిట్ అయిన ప్రాజెక్టులు (పుష్ప 2) పూర్తి చేశాకే ఈ భారీ ప్రాజెక్టుపై అల్లు అర్జున్ ఫోకస్ పెట్టబోతున్నారు.
త్వరలోనే ‘పుష్ప 2’ కంప్లీట్ కానుంది. ఆగస్టులో ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయ్. కాగా, అట్లీ సినిమాని హోమ్ బ్యానర్ అయిన గీతా ఆర్ట్స్ 2లో నిర్మించేందుకు సిద్ధమవుతున్నారట.
అయితే, ఇంతవరకూ గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో పెద్ద సినిమాలేమీ రూపొందింది లేదు. కానీ, ఈ బ్యానర్ని ఇంకాస్త ఎత్తుకు తీసుకెళ్లాలంటే ఓ ప్రతిష్టాత్మక చిత్రం రూపొందాల్సిన ఆవశ్యకత ఎంతైనా వుంది. అందుకే తన సినిమానే ఈ బ్యానర్లో రూపొందించాలనుకుంటున్నారట.
అయితే, మరో ప్రముఖ నిర్మాణ సంస్థతో కలిసి అల్లు అర్జున్ ఈ నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఆ నిర్మాణ సంస్థ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగం పంచుకోనుందట. ఆల్రెడీ ఆ విషయమై మంతనాలు కూడా జరుగుతున్నాయట. అదేంటో త్వరలో వెల్లడి కానుంది.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









