‘కల్కి’.! ఇప్పుడీ ట్విస్ట్లేంది అశ్వినా.?
- April 08, 2024ప్రబాస్-నాగ అశ్విన్ కాంబినేషన్లో రూపొందుతోన్న ‘కల్కి 2898 ఏడీ’ చిత్రానికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ ప్రచారం సర్క్యులేట్ అవుతోంది. ఇంట్రెస్ట్ అనాలా.? వద్దా.? మేం చెబుతాం అంటారా.? అదీ నిజమేలెండి.
అసలు మ్యాటర్ ఏంటంటే, ‘కల్కి’ లో బోలెడంత మంది ప్రముఖ నటీ నటులు నటిస్తున్న సంగతి తెలిసిందే. బిగ్బీ అమితాబ్ బచ్చన్ నుంచి, విశ్వ నటుడు కమల్ హాసన్ వరకూ వివిధ కీలక పాత్రలు పోషిస్తున్నారు ఈ సినిమాలో.
అయితే, తాజాగా ఈ సినిమాలో విలన్కి సంబంధించిన విషయమొకటి సరికొత్త ప్రచారంగా ఊపందుకుంది. అదేంటంటే, ఇంతవరకూ మెయిన్ విలన్ కమల్ హాసన్ అన్న సంగతి తెలుసు. కానీ, కమల్ క్యారెక్టర్ జస్ట్ గెస్ట్ రోల్ మాత్రమే అన్నది తాజా ప్రచారం తాలూకు సారాంశం.
దాంతో, ఈ సినిమాలో మెయిన్ విలన్ రోల్ సర్ప్రైజింగ్గా వుంచారా.? అన్న అనుమానాలు వస్తున్నాయ్. ఆ సంగతి అటుంచితే, జూనియర్ ఎన్టీయార్, నాగార్జున, నాని తదితరులు ఈ సినిమాలో భాగం పంచుకోబోతున్నారన్న సరికొత్త ప్రచారం కూడా ఊపందుకుంది.
ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది ఈ సినిమా. రిలీజ్ టైమ్ బేరీజు వేసుకుని చూస్తే.. ఇక షూటింగ్ చేసే అవకాశమే వుండదు. నిర్మాణానంతర పనులు మాత్రమే పెండింగ్ వుండాల్సి వుంది. గట్టిగా చెప్పాల్సి వస్తే.. అవి కూడా పూర్తి కావల్సి వుంది. ప్రస్తుతం ప్రమోషన్లతో ‘కల్కి’ టీమ్ బిజీగా వుండి వుండాలి. మే 9న సినిమా రిలీజ్ డేట్ పక్కా అని టీమ్ గట్టిగా చెబుతోంది. ఈ టైమ్లో ఈ ట్విస్టులేందో చూడాలి మరి.
తాజా వార్తలు
- దుబాయ్ లో సైకిళ్లు, స్కూటర్ల కోసం మల్టీయూజ్ ట్రాక్
- సౌత్ అల్ బతినా గవర్నరేట్లో అగ్నిప్రమాదం
- కింగ్ సల్మాన్ కు వైద్య పరీక్షలు
- నకిలీ వర్క్ పర్మిట్లు సేల్..ఇద్దరు అరెస్ట్
- మారిటైమ్ సేఫ్టీ నినాదంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- ఇరాన్ అధ్యక్షుడు రైసీహెలికాప్టర్ ప్రమాదంలో మృతి..!
- యూఏఈ ప్రయాణ వ్యాక్సిన్లు: అవసరమైన జాబ్లు, ఖర్చులు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..