టీడీపీ విరాళాల వెబ్ సైట్ ప్రారంభించిన చంద్రబాబు..
- April 09, 2024
అమరావతి: తెలుగుదేశం పార్టీ విరాళాల కోసం ప్రత్యేక వెబ్ సైట్ ను తీసుకువచ్చింది. ఈ వెబ్ సైట్ https://tdpforandhra.com/ను టీడీపీ అధినేత చంద్రబాబు నేడు ప్రారంభించారు. తనవంతుగా రూ.99,999 విరాళం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీడీపీ అభిమానులు, మద్దతుదారులు విరాళాలు ఇవ్వాలని కోరారు. కాగా, విరాళాలు ఇచ్చిన వారికి రసీదు కూడా అందిస్తారు. ఈ వెబ్ సైట్లో రూ.99, రూ.999, రూ.9,999, రూ.19,999, రూ.99,999, ఇతర మొత్తాల కోసం ఆప్షన్లు ఇచ్చారు. 18 ఏళ్లకు పైబడిన వారి నుంచే విరాళాలు స్వీకరించనున్నారు. ఆ మేరకు వెబ్ సైట్లోనే ఆధార్ వెరిఫికేషన్ చేయనున్నారు.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









