ప్రతిష్టాత్మక స్పోర్ట్ అవార్డును అందుకున్న ప్రిన్స్ అబ్దుల్ అజీజ్
- April 11, 2024లండన్: యూకేలోని బర్మింగ్హామ్లో జరిగిన స్పోర్ట్అకార్డ్ కన్వెన్షన్ సందర్భంగా సౌదీ ఒలింపిక్ మరియు పారాలింపిక్ కమిటీ (SOPC) చైర్మన్ ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ టర్కీ బిన్ ఫైసల్ ప్రతిష్టాత్మక స్పోర్ట్అకార్డ్ అవార్డును అందుకున్నారు.
ఈ వేడుకకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాచ్, జాతీయ ఒలింపిక్ కమిటీల సంఘం (ANOC) అధ్యక్షుడు రాబిన్ ఇ. మిచెల్ సహా ప్రముఖులు హాజరయ్యారు. 2021లో UTS వరల్డ్ వర్చువల్ యూత్ ఫెస్టివల్ను విజయవంతంగా నిర్వహించినందుకు గానూ SOPCకి ఈ అవార్డు లభించింది.ఇందులో 100కి పైగా అంతర్జాతీయ సంస్థలు మరియు వివిధ దేశాల నుండి 30,000 మంది పిల్లలు పాల్గొన్నారు. ఈ సంధర్భంగా ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ కృతజ్ఞతలు తెలుపుతూ.. రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ మరియు క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ ల తిరుగులేని మద్దతు కారణంగా ఈ విజయాలు సాధ్యమయ్యాయని తెలిపారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం
- దుబాయ్లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!