ప్రతిష్టాత్మక స్పోర్ట్ అవార్డును అందుకున్న ప్రిన్స్ అబ్దుల్ అజీజ్

- April 11, 2024 , by Maagulf
ప్రతిష్టాత్మక స్పోర్ట్ అవార్డును అందుకున్న ప్రిన్స్ అబ్దుల్ అజీజ్

లండన్: యూకేలోని బర్మింగ్‌హామ్‌లో జరిగిన స్పోర్ట్అకార్డ్ కన్వెన్షన్ సందర్భంగా సౌదీ ఒలింపిక్ మరియు పారాలింపిక్ కమిటీ (SOPC) చైర్మన్ ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ టర్కీ బిన్ ఫైసల్ ప్రతిష్టాత్మక స్పోర్ట్అకార్డ్ అవార్డును అందుకున్నారు.

ఈ వేడుకకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాచ్, జాతీయ ఒలింపిక్ కమిటీల సంఘం (ANOC) అధ్యక్షుడు రాబిన్ ఇ. మిచెల్ సహా ప్రముఖులు హాజరయ్యారు. 2021లో UTS వరల్డ్ వర్చువల్ యూత్ ఫెస్టివల్‌ను విజయవంతంగా నిర్వహించినందుకు గానూ SOPCకి ఈ అవార్డు లభించింది.ఇందులో 100కి పైగా అంతర్జాతీయ సంస్థలు మరియు వివిధ దేశాల నుండి 30,000 మంది పిల్లలు పాల్గొన్నారు.  ఈ సంధర్భంగా ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ కృతజ్ఞతలు తెలుపుతూ.. రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ మరియు క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ ల తిరుగులేని మద్దతు కారణంగా ఈ విజయాలు సాధ్యమయ్యాయని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com