ప్రతిష్టాత్మక స్పోర్ట్ అవార్డును అందుకున్న ప్రిన్స్ అబ్దుల్ అజీజ్
- April 11, 2024
లండన్: యూకేలోని బర్మింగ్హామ్లో జరిగిన స్పోర్ట్అకార్డ్ కన్వెన్షన్ సందర్భంగా సౌదీ ఒలింపిక్ మరియు పారాలింపిక్ కమిటీ (SOPC) చైర్మన్ ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ టర్కీ బిన్ ఫైసల్ ప్రతిష్టాత్మక స్పోర్ట్అకార్డ్ అవార్డును అందుకున్నారు.
ఈ వేడుకకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాచ్, జాతీయ ఒలింపిక్ కమిటీల సంఘం (ANOC) అధ్యక్షుడు రాబిన్ ఇ. మిచెల్ సహా ప్రముఖులు హాజరయ్యారు. 2021లో UTS వరల్డ్ వర్చువల్ యూత్ ఫెస్టివల్ను విజయవంతంగా నిర్వహించినందుకు గానూ SOPCకి ఈ అవార్డు లభించింది.ఇందులో 100కి పైగా అంతర్జాతీయ సంస్థలు మరియు వివిధ దేశాల నుండి 30,000 మంది పిల్లలు పాల్గొన్నారు. ఈ సంధర్భంగా ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ కృతజ్ఞతలు తెలుపుతూ.. రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ మరియు క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ ల తిరుగులేని మద్దతు కారణంగా ఈ విజయాలు సాధ్యమయ్యాయని తెలిపారు.
తాజా వార్తలు
- పాత నోట్ల మార్పిడికి సెప్టెంబర్ 21 డెడ్లైన్.. ఒమన్ సెంట్రల్ బ్యాంక్ కీలక ప్రకటన
- అబుదాబి నేచురల్ హిస్టరీ మ్యూజియాన్ని సందర్శించిన షేక్ మహమ్మద్
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- దుబాయ్ AIM కాంగ్రెస్లో మధ్యప్రదేశ్ పెట్టుబడి అవకాశాల ప్రదర్శన
- రూ.3 లక్షలు తిరిగి ఇచ్చిన కండక్టర్.. హజ్ యాత్రికుడి డబ్బును భద్రంగా అప్పగింత
- వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు!
- మొదటిసారి ఢిల్లీ బయట జాతీయ అవార్డుల వేడుక..!
- ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ: KTR
- జాబ్స్ పేరుతో కోట్లలో మోసం.. 'నందూస్ వరల్డ్' నందన అరెస్ట్..
- సౌదీతో భారత్ సంబంధాల బలోపేతంలో భారత కార్మికుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్







