ఎలక్ట్రిక్ స్కూటర్ వినియోగదారులకు అలెర్ట్ జారీ

- April 12, 2024 , by Maagulf
ఎలక్ట్రిక్ స్కూటర్ వినియోగదారులకు అలెర్ట్ జారీ

దోహా: ఖతార్ లో ఇ-స్కూటర్ రైడర్ల సంఖ్య పెరుగుతోంది. వారు తమ భద్రత కోసం, అలాగే రోడ్డుపై ఇతరులకు ట్రాఫిక్ నియమాలను పాటించాలని అంతర్గత మంత్రిత్వ శాఖ రైడర్ల భద్రతను గుర్తుచేస్తూ ఒక వీడియోను విడుదల చేసింది.  ఎలక్ట్రిక్ స్కూటర్లను ఉపయోగిస్తున్నప్పుడు భద్రతా మార్గదర్శకాలను అనుసరించడం ప్రమాదాలను నివారిస్తుందని తెలిపింది. 'ఎలక్ట్రిక్ స్కూటర్ భద్రత కోసం కీలక మార్గదర్శకాలు' వీడియో రైడింగ్ చేసేటప్పుడు రిఫ్లెక్టివ్ చొక్కాతోపాటు హెల్మెట్ ధరించాలని వినియోగదారులకు గుర్తు చేసింది. ఇ-స్కూటర్ రైడర్‌లు వేగాన్ని నివారించాలని, ఎల్లప్పుడూ జాగ్రత్తగా ప్రయాణించాలని, వారికి సురక్షితమైన ప్రయాణాన్ని కాంక్షిస్తూ వీడియోను షేర్ చేసారు.   

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com