ఎలక్ట్రిక్ స్కూటర్ వినియోగదారులకు అలెర్ట్ జారీ
- April 12, 2024దోహా: ఖతార్ లో ఇ-స్కూటర్ రైడర్ల సంఖ్య పెరుగుతోంది. వారు తమ భద్రత కోసం, అలాగే రోడ్డుపై ఇతరులకు ట్రాఫిక్ నియమాలను పాటించాలని అంతర్గత మంత్రిత్వ శాఖ రైడర్ల భద్రతను గుర్తుచేస్తూ ఒక వీడియోను విడుదల చేసింది. ఎలక్ట్రిక్ స్కూటర్లను ఉపయోగిస్తున్నప్పుడు భద్రతా మార్గదర్శకాలను అనుసరించడం ప్రమాదాలను నివారిస్తుందని తెలిపింది. 'ఎలక్ట్రిక్ స్కూటర్ భద్రత కోసం కీలక మార్గదర్శకాలు' వీడియో రైడింగ్ చేసేటప్పుడు రిఫ్లెక్టివ్ చొక్కాతోపాటు హెల్మెట్ ధరించాలని వినియోగదారులకు గుర్తు చేసింది. ఇ-స్కూటర్ రైడర్లు వేగాన్ని నివారించాలని, ఎల్లప్పుడూ జాగ్రత్తగా ప్రయాణించాలని, వారికి సురక్షితమైన ప్రయాణాన్ని కాంక్షిస్తూ వీడియోను షేర్ చేసారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం
- దుబాయ్లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ