మాస్ రాజా రవితేజ కొత్తేపారం.!

- April 16, 2024 , by Maagulf
మాస్ రాజా రవితేజ కొత్తేపారం.!

సినిమాలు చేస్తూనే ఇతరత్రా కమర్షియల్ బిజినెస్‌లలోనూ పెట్టుబడులు పెడుతుంటారు సెలబ్రిటీలు. హీరోయిన్లు రకుల్ ప్రీత్, కాజల్ అగర్వాల్, సమంత.. ఇలా పలువురు ముద్దుగుమ్మలు సినిమాల్లో సంపాదించిన డబ్బును రెస్టారెంట్ బిజినెస్ అనీ, ఫిట్‌నెస్ బిజినెస్ అనీ.. ఇలా పలు రకాల బిజినెస్‌లలో పెట్టుబడులు పెట్టి ఆదాయం ఆర్జిస్తున్నారు.

హీరోల విషయానికి వస్తే, మహేష్ బాబు ఏషియన్ కంపెనీతో కలిసి ఏఎంబీ, అల్లు అర్జున్ ఏఏఏ.. విజయ్ దేవరకొండ ఓ వైపు తన బ్రాండ్ బట్టల దుకాణంతో పాటూ, ఏషియన్ కంపెనీతో కలిసి మల్టీఫ్లెక్స్ బిజినెస్‌లోనూ ఆదాయం ఆర్జిస్తున్నారు.

తాజాగా ఈ లిస్టులోకి మాస్ రాజా రవితేజ కూడా చేరిపోయారు. ఏషియన్ కంపెనీతో కలిసి రవితేజ కూడా ధియేటర్ల బిజినెస్‌లో అడుగుపెడుతున్నారు. దిల్‌సుఖ్ నగర్‌లో ఏషియన్ కంపెనీతో కలిసి రవితేజ ఏఆర్టీ మల్టీ‌ఫ్లెక్స్ నిర్మాణానికి రెడీ అవుతున్నారు. ఆరు స్క్రీన్లతో సిద్ధం కాబోతున్న ఈ ధియేటర్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయట.

అన్నట్లు ఆల్రెడీ రవితేజ నిర్మాణంలోనూ భాగం పంచుకుంటున్న సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com