మాస్ రాజా రవితేజ కొత్తేపారం.!
- April 16, 2024
సినిమాలు చేస్తూనే ఇతరత్రా కమర్షియల్ బిజినెస్లలోనూ పెట్టుబడులు పెడుతుంటారు సెలబ్రిటీలు. హీరోయిన్లు రకుల్ ప్రీత్, కాజల్ అగర్వాల్, సమంత.. ఇలా పలువురు ముద్దుగుమ్మలు సినిమాల్లో సంపాదించిన డబ్బును రెస్టారెంట్ బిజినెస్ అనీ, ఫిట్నెస్ బిజినెస్ అనీ.. ఇలా పలు రకాల బిజినెస్లలో పెట్టుబడులు పెట్టి ఆదాయం ఆర్జిస్తున్నారు.
హీరోల విషయానికి వస్తే, మహేష్ బాబు ఏషియన్ కంపెనీతో కలిసి ఏఎంబీ, అల్లు అర్జున్ ఏఏఏ.. విజయ్ దేవరకొండ ఓ వైపు తన బ్రాండ్ బట్టల దుకాణంతో పాటూ, ఏషియన్ కంపెనీతో కలిసి మల్టీఫ్లెక్స్ బిజినెస్లోనూ ఆదాయం ఆర్జిస్తున్నారు.
తాజాగా ఈ లిస్టులోకి మాస్ రాజా రవితేజ కూడా చేరిపోయారు. ఏషియన్ కంపెనీతో కలిసి రవితేజ కూడా ధియేటర్ల బిజినెస్లో అడుగుపెడుతున్నారు. దిల్సుఖ్ నగర్లో ఏషియన్ కంపెనీతో కలిసి రవితేజ ఏఆర్టీ మల్టీఫ్లెక్స్ నిర్మాణానికి రెడీ అవుతున్నారు. ఆరు స్క్రీన్లతో సిద్ధం కాబోతున్న ఈ ధియేటర్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయట.
అన్నట్లు ఆల్రెడీ రవితేజ నిర్మాణంలోనూ భాగం పంచుకుంటున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధం
- పద్మ అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ
- కేంద్రం సంచలనం..వాళ్లంతా గ్యాస్ సిలిండర్స్ వెనక్కి ఇచ్చేయాలి..
- నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్
- ఇదీ మీ ప్రభుత్వం...కలిసి ముందుకు సాగుదాం: సీఎం రేవంత్
- గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్, 2 చిన్నారులు మృతి, 7 మందికి గాయాలు
- వాట్సాప్ నుంచే హాస్పిటల్ OP రిజిస్ట్రేషన్లు
- గల్ఫ్ జనసేన కువైట్ ఆధ్వర్యంలో కువైత్ లో రక్తదాన కార్యక్రమం
- రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
- తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు









