మాస్ రాజా రవితేజ కొత్తేపారం.!
- April 16, 2024సినిమాలు చేస్తూనే ఇతరత్రా కమర్షియల్ బిజినెస్లలోనూ పెట్టుబడులు పెడుతుంటారు సెలబ్రిటీలు. హీరోయిన్లు రకుల్ ప్రీత్, కాజల్ అగర్వాల్, సమంత.. ఇలా పలువురు ముద్దుగుమ్మలు సినిమాల్లో సంపాదించిన డబ్బును రెస్టారెంట్ బిజినెస్ అనీ, ఫిట్నెస్ బిజినెస్ అనీ.. ఇలా పలు రకాల బిజినెస్లలో పెట్టుబడులు పెట్టి ఆదాయం ఆర్జిస్తున్నారు.
హీరోల విషయానికి వస్తే, మహేష్ బాబు ఏషియన్ కంపెనీతో కలిసి ఏఎంబీ, అల్లు అర్జున్ ఏఏఏ.. విజయ్ దేవరకొండ ఓ వైపు తన బ్రాండ్ బట్టల దుకాణంతో పాటూ, ఏషియన్ కంపెనీతో కలిసి మల్టీఫ్లెక్స్ బిజినెస్లోనూ ఆదాయం ఆర్జిస్తున్నారు.
తాజాగా ఈ లిస్టులోకి మాస్ రాజా రవితేజ కూడా చేరిపోయారు. ఏషియన్ కంపెనీతో కలిసి రవితేజ కూడా ధియేటర్ల బిజినెస్లో అడుగుపెడుతున్నారు. దిల్సుఖ్ నగర్లో ఏషియన్ కంపెనీతో కలిసి రవితేజ ఏఆర్టీ మల్టీఫ్లెక్స్ నిర్మాణానికి రెడీ అవుతున్నారు. ఆరు స్క్రీన్లతో సిద్ధం కాబోతున్న ఈ ధియేటర్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయట.
అన్నట్లు ఆల్రెడీ రవితేజ నిర్మాణంలోనూ భాగం పంచుకుంటున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!