ఆ లోపు రుణమాఫీ చేస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్
- April 19, 2024హైదరాబాద్: రైతులు అంటేనే కాంగ్రెస్ పార్టీ అని.. కాంగ్రెస్ అంటేనే రైతులు అని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆగస్టు 15లోగా రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని, రూ.500 బోనస్ ఇస్తామని తెలిపారు. కరీంనగర్ జిల్లా అంబెద్కర్ స్టేడియం వద్ద పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ సర్కారు ప్రజాపాలన అందిస్తోందని పొన్నం ప్రభాకర్ చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీ కూడబలుక్కుని మాట్లాడుతున్నాయని అన్నారు. బోగస్ మాటలు మాట్లాడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్లు స్థిరంగా ఉంటుందని తెలిపారు. తల్లిని రాజకీయాల్లోకి లాగిన వ్యక్తి బండి సంజయ్ అని అన్నారు.
తల్లి పేరుమీద రాజకీయాలు చేసేది ఏవరో అందరికి తెలుసని పొన్నం ప్రభాకర్ చెప్పారు. బండి సంజయ్, గంగుల కమలాకర్ ఇద్దరూ స్నేహితులు అని అన్నారు. వినోద్ కుమార్ ను ఓడించడానికి గతంలో లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని తెలిపారు. పేద ప్రజల భూములను లాక్కున్న వారిని వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు.
గత అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షా 75 వేల కోట్ల ప్రొసీడింగ్స్ ఇచ్చిందని పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఎన్నికల కోడ్ అయిపోగానే అన్ని పనులు పూర్తి చేస్తామని తెలిపారు. అక్రమ దందాలకు అవినీతికి, వ్యతిరేకంగా ప్రజలు ఓటు వేయాలంటూ పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్