మహేష్‌ సరసన పరిణీతి చోప్రా ఎంపిక...

- June 07, 2016 , by Maagulf
మహేష్‌ సరసన పరిణీతి చోప్రా ఎంపిక...

వే సవి సెలవుల్లో భాగంగా ప్రస్తుతం విదేశాల్లో గడుపుతున్నారు మహేష్‌బాబు. వచ్చీ రాగానే కొత్త సినిమా కోసం రంగంలోకి దిగుతారు. మురుగదాస్‌ దర్శకత్వం వహించనున్న ఆ చిత్రంలో మహేష్‌ సరసన కథానాయికగా బాలీవుడ్‌ భామ పరిణీతి చోప్రా ఎంపికైనట్టు తెలిసింది. మొదట పలువురు దక్షిణాది కథానాయికల పేర్లు వినిపించినప్పటికీ చిత్రబృందం మాత్రం పరిణీతి వైపే మొగ్గు చూపినట్టు సమాచారం. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కనున్న ఈ చిత్రంలో దర్శకుడు ఎస్‌.జె.సూర్య ఓ ముఖ్యభూమిక పోషిస్తారని తెలుస్తోంది. ఇదొక విభిన్నమైన కథతో తెరకెక్కబోతోందని మహేష్‌ ఇదివరకే తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com