మహేష్ సరసన పరిణీతి చోప్రా ఎంపిక...
- June 07, 2016
వే సవి సెలవుల్లో భాగంగా ప్రస్తుతం విదేశాల్లో గడుపుతున్నారు మహేష్బాబు. వచ్చీ రాగానే కొత్త సినిమా కోసం రంగంలోకి దిగుతారు. మురుగదాస్ దర్శకత్వం వహించనున్న ఆ చిత్రంలో మహేష్ సరసన కథానాయికగా బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా ఎంపికైనట్టు తెలిసింది. మొదట పలువురు దక్షిణాది కథానాయికల పేర్లు వినిపించినప్పటికీ చిత్రబృందం మాత్రం పరిణీతి వైపే మొగ్గు చూపినట్టు సమాచారం. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కనున్న ఈ చిత్రంలో దర్శకుడు ఎస్.జె.సూర్య ఓ ముఖ్యభూమిక పోషిస్తారని తెలుస్తోంది. ఇదొక విభిన్నమైన కథతో తెరకెక్కబోతోందని మహేష్ ఇదివరకే తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







