హరియాణా బస్సులో పేలుడు.. 15 మందికి గాయాలు..
- June 07, 2016
హరియాణాలోని ఓ ప్రైవేటు బస్సులో ఈరోజు పేలుడు సంభవించింది. ఘటనలో 15 మందికి గాయాలయ్యాయి. వారిలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రాష్ట్రంలోని ఫతేబాద్ జిల్లాలోని బునా రోడ్డులో ప్రైవేటు బస్సులో ఉదయం 11 గంటల ప్రాంతంలో పేలుడు జరిగింది. జఖాల్ నుంచి ఫతేబాద్ వెళ్తున్న బస్సులో ఓ ప్రయాణికుడు పేలుడు పదార్థాలను బ్యాగులో తరలిస్తుండగా ప్రమాదం సంభవించినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. పోలీసులు బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. బ్యాగు తీసుకొచ్చిన వ్యక్తి పరారీలో ఉన్నట్లు సమాచారం. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు.హరియాణాలో బస్సులో పేలుళ్లు సంభవించడం ఈ ఏడాదిలో ఇది నాలుగోసారి.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







