హరియాణా బస్సులో పేలుడు.. 15 మందికి గాయాలు..
- June 07, 2016
హరియాణాలోని ఓ ప్రైవేటు బస్సులో ఈరోజు పేలుడు సంభవించింది. ఘటనలో 15 మందికి గాయాలయ్యాయి. వారిలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రాష్ట్రంలోని ఫతేబాద్ జిల్లాలోని బునా రోడ్డులో ప్రైవేటు బస్సులో ఉదయం 11 గంటల ప్రాంతంలో పేలుడు జరిగింది. జఖాల్ నుంచి ఫతేబాద్ వెళ్తున్న బస్సులో ఓ ప్రయాణికుడు పేలుడు పదార్థాలను బ్యాగులో తరలిస్తుండగా ప్రమాదం సంభవించినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. పోలీసులు బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. బ్యాగు తీసుకొచ్చిన వ్యక్తి పరారీలో ఉన్నట్లు సమాచారం. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు.హరియాణాలో బస్సులో పేలుళ్లు సంభవించడం ఈ ఏడాదిలో ఇది నాలుగోసారి.
తాజా వార్తలు
- ఖతార్ ఎయిర్వేస్ యూఏఈ, సిరియాకు రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభం
- ఈజీ మనీ కోసం మహిళ అదిరిపోయే స్కెచ్..
- రాంబిల్లిలో గ్రీన్ ఎనర్జీ విప్లవం
- ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ లీసా గిల్
- NATS ఆధ్వర్యంలో ‘హైవే దత్తత’ కార్యక్రమం
- కర్ణాటకలో విదేశీ మహిళ పై దాడి
- ప్రాంతీయ సంక్షోభాలను అంతం చేయడానికి దౌత్యమే ఏకైక మార్గం..!!
- యునెస్కో-సుల్తాన్ హైథమ్ బహుమతి..సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు గుర్తింపు..!!
- యూఏఈ లాటరీ: తాజా డ్రా విజేతల సంఖ్యలు.. ఎవరికీ దక్కని జాక్పాట్..!!
- 10 ఏళ్ల జైలు శిక్ష, 10 మిలియన్ల సౌదీ రియాల్స్ జరిమానా..!!









