హరియాణా బస్సులో పేలుడు.. 15 మందికి గాయాలు..

- June 07, 2016 , by Maagulf
హరియాణా బస్సులో పేలుడు.. 15 మందికి గాయాలు..

 హరియాణాలోని ఓ ప్రైవేటు బస్సులో ఈరోజు పేలుడు సంభవించింది. ఘటనలో 15 మందికి గాయాలయ్యాయి. వారిలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రాష్ట్రంలోని ఫతేబాద్‌ జిల్లాలోని బునా రోడ్డులో ప్రైవేటు బస్సులో ఉదయం 11 గంటల ప్రాంతంలో పేలుడు జరిగింది. జఖాల్‌ నుంచి ఫతేబాద్‌ వెళ్తున్న బస్సులో ఓ ప్రయాణికుడు పేలుడు పదార్థాలను బ్యాగులో తరలిస్తుండగా ప్రమాదం సంభవించినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. పోలీసులు బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. బ్యాగు తీసుకొచ్చిన వ్యక్తి పరారీలో ఉన్నట్లు సమాచారం. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు.హరియాణాలో బస్సులో పేలుళ్లు సంభవించడం ఈ ఏడాదిలో ఇది నాలుగోసారి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com