ఏపీలో పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల..
- April 22, 2024
అమరావతి: ఏపీలో పదోతరగతి ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్. సురేష్ కుమార్ 2023 -24 టెన్త్ ఫలితాలను విడుదల చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా రెగ్యూలర్ విద్యార్థులు 6,16,617 మందిలో 5,34,574 (86.69శాతం) మంది ఉత్తీర్ణత సాధించారని సురేష్ కుమార్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా బాలురు 84.32శాతం, బాలికలు 89.17శాతం ఉత్తీర్ణ సాధించారని, ఈ ఏడాది బాలికలే అధిక సంఖలో ఉత్తీర్ణత సాధించారని అన్నారు. అదేవిధంగా 11,645 పాఠశాలల నుంచి పరీక్షలు రాశారు.. 2,803 పాఠశాలల్లో 100శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 17 పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదని సురేష్ కుమార్ తెలిపారు.
అత్యధిక ఉత్తీర్ణత సాధించిన జిల్లాల్లో ..
మొదటి స్థానంలో పార్వతీపురం మన్యం జిల్లా నిలవగా.. చివరి స్థానంలో కర్నూల్ జిల్లా నిలిచింది. పార్వతీపురం మన్యం జిల్లా 96.37శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా.. కర్నూల్ జిల్లాలో 62.47 శాతం మంది విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలిచింది.
సబ్జెక్టుల వారిగా విద్యార్థుల ఉత్తీర్ణత శాతం..
మొదటి లాంగ్వేజ్ 96.47శాతం
రెండో లాంగ్వేజ్ 99.24శాతం
మూడో లాంగ్వేజ్ 98.52 శాతం
మ్యాథమ్యాటిక్స్ 93.33శాతం
జనరల్ సైన్స్ 91.29శాతం
సోషల్ స్టడీస్ 95.34శాతం
మే 24 నుంచి సప్లమెంటరీ పరీక్షలు..
ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జూన్ 3వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని ఎస్. సురేష్ కుమార్ తెలిపారు. రేపటి నుంచే అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలకు అప్లయ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. రీ వాల్యూయేషన్, రీ కౌంటింగ్ కోసం రేపటి నుంచి ఆన్ లైన్ లోనే మాత్రమే అప్లికేషన్ తీసుకోవటం జరుగుతుంది.. అదికూడా స్కూల్ హెడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలోనే అప్లికేషన్ చేసుకొనే అవకాశం ఉంటుందని సురేష్ కుమార్ తెలిపారు.
ఫలితాల కోసం https://bse.ap.gov.in/ వెబ్ సైట్ లో చెక్ చేయండి.
ఈ ఏడాది మార్చి నెల 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. మొత్తం ఏడు లక్షల మంది విద్యార్థులు పరీక్షలు శారు. వీరిలో రెగ్యూలర్ విద్యార్థులు 6.16లక్షలు కాగా.. గత ఏడాది ఫెయిల్ అయిన విద్యార్థులు లక్షకు పైగా ఉన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?