3 నెలల్లో 67 హాస్పిటాలిటీ సౌకర్యాలు మూసివేత
- April 23, 2024
రియాద్: పర్యాటక మంత్రిత్వ శాఖ 2024 మొదటి మూడు నెలల్లో రాజ్యం అంతటా హోటళ్లు, రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లతో సహా 67 టూరిజం హాస్పిటాలిటీ సౌకర్యాలను మూసివేసింది. తనిఖీ పర్యటనల సమయంలో వివిధ ఉల్లంఘనలను గుర్తించిన తర్వాత శిక్షార్హమైన చర్యలు తీసుకున్నారు. అధికారులు 15,000 పైగా పర్యవేక్షణ సందర్శనలను నిర్వహించారని, ఈ సమయంలో వారు 10,000 కంటే ఎక్కువ ఉల్లంఘనలను గుర్తించారని,సంబంధిత నియమాలు మరియు నిబంధనలకు అనుగుణంగా లేని సౌకర్యాలను మూసివేసారని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. "అవర్ గెస్ట్స్ ఆర్ ఏ ప్రయారిటీ m" అనే పేరుతో చేపట్టిన ప్రచారంలో భాగంగా ఈ కాలంలో 11,000 కంటే ఎక్కువ ఫిర్యాదులను పరిష్కరించినట్లు మంత్రిత్వ శాఖ వివరించింది. జరిమానాలలో గరిష్టంగా SR1 మిలియన్ జరిమానా లేదా మూసివేయడం లేదా రెండూ ఉంటాయని పేర్కొన్నది. రాజ్యంలో అన్ని ప్రాంతాలలో ఆతిథ్య సౌకర్యాలు తప్పనిసరిగా టూరిజం చట్టం మరియు దాని నిబంధనలకు కట్టుబడి ఉండాలని సూచించింది. 2023 సంవత్సరంలో రాజ్యానికి 100 మిలియన్లకు పైగా పర్యాటకులు వచ్చారని తెలిపింది.
తాజా వార్తలు
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- దుబాయ్ AIM కాంగ్రెస్లో మధ్యప్రదేశ్ పెట్టుబడి అవకాశాల ప్రదర్శన
- రూ.3 లక్షలు తిరిగి ఇచ్చిన కండక్టర్.. హజ్ యాత్రికుడి డబ్బును భద్రంగా అప్పగింత
- వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు!
- మొదటిసారి ఢిల్లీ బయట జాతీయ అవార్డుల వేడుక..!
- ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ: KTR
- జాబ్స్ పేరుతో కోట్లలో మోసం.. 'నందూస్ వరల్డ్' నందన అరెస్ట్..
- సౌదీతో భారత్ సంబంధాల బలోపేతంలో భారత కార్మికుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్
- దుబాయ్లో ప్రముఖ గాయకుడు నిసార్ వయనాడ్ హఠాన్మరణం
- యాదగిరిగుట్టలో కన్నులవిందుగా రుక్మిణీ కల్యాణం







