3 నెలల్లో 67 హాస్పిటాలిటీ సౌకర్యాలు మూసివేత
- April 23, 2024
రియాద్: పర్యాటక మంత్రిత్వ శాఖ 2024 మొదటి మూడు నెలల్లో రాజ్యం అంతటా హోటళ్లు, రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లతో సహా 67 టూరిజం హాస్పిటాలిటీ సౌకర్యాలను మూసివేసింది. తనిఖీ పర్యటనల సమయంలో వివిధ ఉల్లంఘనలను గుర్తించిన తర్వాత శిక్షార్హమైన చర్యలు తీసుకున్నారు. అధికారులు 15,000 పైగా పర్యవేక్షణ సందర్శనలను నిర్వహించారని, ఈ సమయంలో వారు 10,000 కంటే ఎక్కువ ఉల్లంఘనలను గుర్తించారని,సంబంధిత నియమాలు మరియు నిబంధనలకు అనుగుణంగా లేని సౌకర్యాలను మూసివేసారని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. "అవర్ గెస్ట్స్ ఆర్ ఏ ప్రయారిటీ m" అనే పేరుతో చేపట్టిన ప్రచారంలో భాగంగా ఈ కాలంలో 11,000 కంటే ఎక్కువ ఫిర్యాదులను పరిష్కరించినట్లు మంత్రిత్వ శాఖ వివరించింది. జరిమానాలలో గరిష్టంగా SR1 మిలియన్ జరిమానా లేదా మూసివేయడం లేదా రెండూ ఉంటాయని పేర్కొన్నది. రాజ్యంలో అన్ని ప్రాంతాలలో ఆతిథ్య సౌకర్యాలు తప్పనిసరిగా టూరిజం చట్టం మరియు దాని నిబంధనలకు కట్టుబడి ఉండాలని సూచించింది. 2023 సంవత్సరంలో రాజ్యానికి 100 మిలియన్లకు పైగా పర్యాటకులు వచ్చారని తెలిపింది.
తాజా వార్తలు
- BD50,000 తమ్కీన్-SIO ఫ్రాడ్.. ఐదుగురికి జైలు శిక్ష..!!
- బేస్మెంట్, అసురక్షిత పార్టిషన్ లపై ఫైర్ ఫోర్స్ హెచ్చరిక..!!
- ఒమన్ను హెచ్చరించిన ట్రంప్..!!
- ఖతార్ వ్యాప్తంగా ఈద్ వేడుకలు..!!
- సౌదీలో 10 మంది ఉల్లంఘనదారులకు భారీ జరిమానా..!!
- తప్పుడు లింక్పై క్లిక్.. సైబర్ సెక్యూరిటీ నిపుణుల హెచ్చరిక..!!
- దొంగిలించిన క్రెడిట్ కార్డుల కొనుగోలుపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు షాక్!
- ఎన్టీఆర్ ఘాట్ వద్ద తారక్, పురందేశ్వరి భావోద్వేగ నివాళులు
- న్యూఢిల్లీలో ‘అప్నాపన్’ పుస్తకావిష్కరణలో పాల్గొన్న వెంకయ్య నాయుడు









