3 నెలల్లో 67 హాస్పిటాలిటీ సౌకర్యాలు మూసివేత
- April 23, 2024
రియాద్: పర్యాటక మంత్రిత్వ శాఖ 2024 మొదటి మూడు నెలల్లో రాజ్యం అంతటా హోటళ్లు, రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లతో సహా 67 టూరిజం హాస్పిటాలిటీ సౌకర్యాలను మూసివేసింది. తనిఖీ పర్యటనల సమయంలో వివిధ ఉల్లంఘనలను గుర్తించిన తర్వాత శిక్షార్హమైన చర్యలు తీసుకున్నారు. అధికారులు 15,000 పైగా పర్యవేక్షణ సందర్శనలను నిర్వహించారని, ఈ సమయంలో వారు 10,000 కంటే ఎక్కువ ఉల్లంఘనలను గుర్తించారని,సంబంధిత నియమాలు మరియు నిబంధనలకు అనుగుణంగా లేని సౌకర్యాలను మూసివేసారని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. "అవర్ గెస్ట్స్ ఆర్ ఏ ప్రయారిటీ m" అనే పేరుతో చేపట్టిన ప్రచారంలో భాగంగా ఈ కాలంలో 11,000 కంటే ఎక్కువ ఫిర్యాదులను పరిష్కరించినట్లు మంత్రిత్వ శాఖ వివరించింది. జరిమానాలలో గరిష్టంగా SR1 మిలియన్ జరిమానా లేదా మూసివేయడం లేదా రెండూ ఉంటాయని పేర్కొన్నది. రాజ్యంలో అన్ని ప్రాంతాలలో ఆతిథ్య సౌకర్యాలు తప్పనిసరిగా టూరిజం చట్టం మరియు దాని నిబంధనలకు కట్టుబడి ఉండాలని సూచించింది. 2023 సంవత్సరంలో రాజ్యానికి 100 మిలియన్లకు పైగా పర్యాటకులు వచ్చారని తెలిపింది.
తాజా వార్తలు
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!







