కొత్త జోనర్ ట్రై చేస్తున్న బెల్లంకొండ.!
- April 24, 2024
‘అల్లుడు శీను’ సినిమాతో తనకంటూ ఓ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పర్చుకున్న హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. తొలి సినిమాకే భారీ బడ్జెట్, స్టార్ హీరోయిన్ (సమంత).. కలయికలో నటించిన బెల్లంకొండ ఆ తర్వాత ఓ మోస్తరు హీరోగా బాగానే సెటిలయ్యాడు.
‘అల్లుడు అదుర్స్’ సినిమా తర్వాత బెల్లంకొండ కాస్త నెమ్మదించాడు. ‘జయ జానకీ నాయకా’ వంటి సూపర్ హిట్ సినిమా కూడా బెల్లంకొండ ఖాతాలో వున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం కాస్త గ్యాప్ తీసుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలో ఓ ప్రత్యేకమైన సినిమాతో రాబోతున్నాడు. హారర్ టచ్తో పాటూ, భారీ టెక్నికల్ వర్క్తో రూపొందుతోన్న ఈ సినిమాకి ‘కిష్కిందపురి’ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఈ సినిమాని వానరాల నేపథ్యంలో రూపొందిస్తున్నట్లు అందుకే ఆ టైటిల్ అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. భారీ విజువల్ ఎఫెక్ట్స్తో డిఫరెంట్గా ఈ సినిమాని రూపొందిస్తున్నారట. తొలిసారి ఈ తరహా కాన్సెప్ట్లో బెల్లంకొండ నటిస్తున్నాడు. బెల్లంకొండ ఈ తాజా ప్రయోగం ఫలిస్తుందో లేదో చూడాలి మరి.
తాజా వార్తలు
- కువైట్లో ఘనంగా ఎన్టీఆర్ 104వ జయంతి, టీడీపీ మహానాడు వేడుకలు
- భారత దేశవ్యాప్తంగా ఒకే హెల్ప్లైన్ నెంబర్..సుప్రీం ఆదేశం
- ఏపీలో రాబోయే మూడు రోజుల పాటు వర్ష సూచన
- సంక్షేమ పథకాల్లో డిజిటల్ కరెన్సీ..RBI కీలక యోచన
- కువైట్పై ఇరాన్ దాడులను ఖండించిన యూఏఈ, కువైట్ విదేశాంగ మంత్రులు
- ఇక NIMSలో రూ.80 వేల జన్యు పరీక్షలు ఉచితం!
- దురాక్రమణను తీవ్రంగా ఖండించిన బహ్రెయిన్..!!
- థియేటర్లలో ఫైర్ ఫోర్స్ సేఫ్టీ తనిఖీలు..!!
- నిజాయితిని చాటిన భారత ప్రవాసుడు.. Dh100,000 అప్పగింత..!!
- ఆసుపత్రులలో చేరిన, తప్పిపోయిన యాత్రికులను గుర్తించడానికి డ్రైవ్..!!









