ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- April 24, 2024: ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ పోలీస్ కమిషనర్ (సీపీ) గా పీహెచ్ డీ రామకృష్ణ ను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ సీపీ కాంతిరాణా పై నిన్న ఈసీ బదిలీ వేటు వేసిన విషయం తెలిసిందే.
వీరి స్థానంలో వేరే అధికారులను నియమించేందుకు వీలుగా ..ఒక్కో పోస్టుకు ముగ్గురేసి ఐపీఎస్ అధికారుల పేర్లతో బుధవారం మధ్యాహ్నం 3 గంటల్లోగా ప్యానల్ సమర్పించాలని సీఎస్ జవహార్ రెడ్డికి ఈసీ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్యానెల్ ను పరిశీలించిన అనంతరం ఈసీ తుది నిర్ణయం తీసుకుంది. కొత్తాగ నియమితులైన అధికారులు గురువారం ఉదయం లోగా బాధ్యతలు చేపట్టాలి ఈసీ ఆదేశించింది.
పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణ్ .. ఎన్నికల షెడ్యుల్ వచ్చిన తర్వాత కూడా వైసీపీకి అనుకూలంగా, ఏకపక్షంగా పని చేస్తున్నారంటూ ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన ఫిర్యాదులపై సమగ్ర విచారణ జరిపిన ఈసీ చివరికి వారిద్దరిపై బదిలీ వేటు వేసింది. సార్వత్రిక ఎన్నికలు పూర్తి అయ్యే వరకూ వారికి ఎన్నికల సంబంధిత విధులేవీ అప్పగించవద్దని ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ