ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- April 24, 2024
: ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ పోలీస్ కమిషనర్ (సీపీ) గా పీహెచ్ డీ రామకృష్ణ ను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ సీపీ కాంతిరాణా పై నిన్న ఈసీ బదిలీ వేటు వేసిన విషయం తెలిసిందే.
వీరి స్థానంలో వేరే అధికారులను నియమించేందుకు వీలుగా ..ఒక్కో పోస్టుకు ముగ్గురేసి ఐపీఎస్ అధికారుల పేర్లతో బుధవారం మధ్యాహ్నం 3 గంటల్లోగా ప్యానల్ సమర్పించాలని సీఎస్ జవహార్ రెడ్డికి ఈసీ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్యానెల్ ను పరిశీలించిన అనంతరం ఈసీ తుది నిర్ణయం తీసుకుంది. కొత్తాగ నియమితులైన అధికారులు గురువారం ఉదయం లోగా బాధ్యతలు చేపట్టాలి ఈసీ ఆదేశించింది.
పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణ్ .. ఎన్నికల షెడ్యుల్ వచ్చిన తర్వాత కూడా వైసీపీకి అనుకూలంగా, ఏకపక్షంగా పని చేస్తున్నారంటూ ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన ఫిర్యాదులపై సమగ్ర విచారణ జరిపిన ఈసీ చివరికి వారిద్దరిపై బదిలీ వేటు వేసింది. సార్వత్రిక ఎన్నికలు పూర్తి అయ్యే వరకూ వారికి ఎన్నికల సంబంధిత విధులేవీ అప్పగించవద్దని ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









